Skip to main content

కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత సినిమాకు రెడ్ కార్పెట్

'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత 
సినిమాకు రెడ్ కార్పెట్
      సినీ దర్శకుడు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ న్యూస్,:
తెనాలి, మే 22: ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న 'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయడం యావత్తు భారత ప్రజానీకం గర్వించదగిన అంశమని " మా - ఏపి" వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.ఈమేరకు మూవీ  ఆర్టిస్ట్  అసోసియేషన్ ,ఆంధ్రప్రదేశ్ శు భాకాంక్షల తీర్మానాన్ని ఆమొదించినట్లు తెలిపారు. గుంటూరుజిల్లా తెనాలిలోని రత్న ఫార్చ్యున్ కల్యాణమండపంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతు ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర నైపుణ్యాల ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కేన్స్ లోని అంతర్జాతీయ వేదికపై భారత చిత్రాలకు పెరిగిన ఆదరణకు గౌరవం లభించడంపట్ల  భారత దేశ సినీ దర్శకుడుగా  సంతోషిస్తున్నానని ఆయన వ్యాఖ్యనించారు.ముస్తాజాబుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన" గాడ్  మస్ట్ డై" చిత్రoలో సాక్షాత్తు దేవుడిని చంపడం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగ చర్చకు దారి తీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స్టాయికి ఎదిగిందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తo చేశారు .ఇందులో హీరోగా నటించిన భారతీయుడు సందీప్ కర్తార్ సింగ్ కు'కేన్స్' లో రెడ్ కార్పెట్ వేయడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.అమెరికా ఫిలిం మేకర్, నటి గ్రేటా గెర్విగ్ జ్యూరీ కు అధ్యక్షులుగా, ఫ్రెంచ్ నటి కెమిల్లి కోటిన్  హోస్ట్ గా వ్యవహరించిన ' కేన్స్' వేడుకల్లో శోభితా ధూళిపాళ, కైరా అద్వానీ, ఐశ్వర్యరాయ్ బచన్, ఎమీ జాక్సన్,జాక్విలిన్ ఫెర్నాండెజ్,కన్నప్ప చిత్ర యూనిట్ తదితరులు పాల్గోనడం  అభినందనీయమని దిలీప్ రాజా పేర్కొన్నారు.సినీ దర్శకుడు అచ్చెన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ " గాడ్  మస్ట్ డై " లాంటీ ప్రయోగాత్మక చిత్రానికి భారత ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించి ఆయా దర్శక నిర్మాతలను గౌరవించాల్సిందిగా భారత ప్రభుత్వానికి మనవి చేశారు.' మా - ఏపి' సంయుక్త కార్యదర్శి,నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతు ఇటీవల ఆస్కార్ అవార్డ్ పొందిన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం తలఎత్తుకుని చూసేలా చేసిందన్నారు. సమావేశం లో
మా - ఎపి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మునిపల్లి
 శ్రీకాంత్,నటుడు బెల్లంకొండ వెంకట్, మన్నె సత్యనారాయణ చౌదరి,సహాయ దర్శకులు ఇంటూరి విజయ భాస్కర్ ,వెంకీ రావణ్ తదితరులు  పాల్గొన్నారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...