Skip to main content

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కు ఘన నివాళి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 101 వ జయంతి  ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లో తాడేపల్లి లోని ఛాంబర్ ప్రాంగణంలో ఘన నివాళులు అర్పింఛారు.
తెలుగు చిత్ర పరిశ్రమ మనుగడకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు  రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్  మాట్లాడుతూ యన్.టి.రామారావు కారణ జన్ముడని, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, వారు హీరోగా ఉన్న సమయంలో పరిశ్రమ చాలా క్రమశిక్షణతో ఉండేదని, ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపు మిచ్చారు.. ఛాంబర్ జనరల్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ చరిత్ర మరువని మహానుభావుడు ఎన్టీఆర్ గారని, చివరివరకు తాను తానుగా బ్రతికాడే తప్ప ఎప్పుడూ తలవంచని గొప్పవ్యక్తి ఆయనని, ఆయన హీరోగా ఉన్న సమయంలో చిన్న రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం నిర్మాతల అంగీకారంతోనే చేశారని, ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు లేవని, నేటి హీరోలు కొంత క్రేజీ రాగానే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ పెంచి ఇండస్ట్రీకి భారంగా తయారవుతున్నారని, ఇండస్ట్రీ ఏమవుతేనేమి మాకు కావాల్సింది మాకు ఇవ్వాలంటున్నారని, ప్రస్తుతం ఇండస్ట్రీ పతనావస్థకు దగ్గరలో ఉందని, అందరూ మనసు మార్చుకొని ఇండస్ట్రీ బాగు కోసం పనిచేయాలని, దానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్  లను  స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు..ఇండస్ట్రీలో ఏది చేయాలన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో ఉందని ఇండస్ట్రీలో  వ్యవస్థను చక్కదిద్దే దమ్మున్న నాయకులు లేరని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ట్రెజరర్ యమ్.శ్రీనాధరావు, జాయింట్ సెక్రటరీస్  జంగా చైతన్య, పులి రమణారెడ్డి, ఈ. సి.మెంబర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, నిర్మాత సభ్యులు బి.వి.రత్నం, శంకర్ , విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...