Skip to main content

ఆంధ్ర లో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం

ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం.
 - దర్శకుల దినోత్సవంలోదర్శకులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఎపి దర్శకులు గళమెత్తారు. స్థానిక రత్న ఫార్టున్ కళ్యాణ మండపం లోశనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 'మా ఎపి ' నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి 'మా- ఎపి' న్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం,శ్రీకారం, చిత్రాల దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సి. ఉమా మహేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా 'దాసరి' పురస్కారాన్ని పట్టణానికి నికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ సుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన దర్శకులు 'డాడీశ్రీనివాస్, ఓం సాయి, బి. సోమసుందరం, చలవాది  శివ ప్రసాద్ లు దర్శక దినోత్సవ సందర్భంగా' మా _ ఎపి నుండి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజర్ శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్రీకరించిన సినిమాలకు ప్రభుత్వం లోకేషన్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు.రాష్ట్రంలో షూటింగ్ లు నిర్విరామంగా జరగటానికి దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిందిగా ఆయన కోరారు.వర్థమాన హీరోరోయిన్లు దివిజ, మౌనిక రెడ్డి, టీనా చౌదరిలను ''ఎపి' సత్కరించింది. కార్యక్రమం లో ముందు గ్రీష్మ శ్రీ భరతనాట్య ప్రదర్శన చేయగా మానసిక వైద్యులు డాక్టర్ ఐనంపూడి శరత్ బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. కారక్రమాన్ని దర్శకుడు కనపర్తి రత్నాకర్ ప్రారంభించగా నటుడు మిలటరీ ప్రసాద్ వందన సమర్పణచేశారు. కాగా శ్రీకాంత్, వెంకీ రావణ్,
తదితరులు పర్య వేక్షించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...