Skip to main content

ఇకపై ప్రతి కళాకారునికి భరోసా

ఇకపై ప్రతి కళాకారునికి భరోసా 
- స్టార్ సినీ రైటర్ బుర్రా సాయి మాధవ్
-పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:తెనాలి: 09-06-2024: ఇకపై తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం లో ప్రతి సభ్యునికి భరోసా వుంటుందని స్టార్ సినీ రైటర్ బుర్ర సాయి మాధవ్ హామీ ఇచ్చారు. తెనాలి కళా వైభవాన్ని సంఘం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం స్థానిక బుర్రిపాలెంరోడ్డు బి.సి. కాలనీలోని సంఘ భవనంలో ఆదివారం ఉదయం సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. గత కార్యవర్గం పదవీకాలం అయిదు సంవత్సరాలు ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు సంఘంలోని మాజీ కార్యవర్గ సభ్యులు  ప్రకటించారు. ఎన్నికలు జరపడం వల్ల డబ్బు చాలా ఖర్చు జరుగుతుందని, ఏకగ్రీవంగా ఎన్నికోవడం వల్ల ఆ ధనాన్ని సంఘానికి వినియోగించ వచ్చునని సాయి మాధవ్ బుర్రా సూచించారు. ఎన్నికల అధికారిగా కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ డి. కాంతారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ సంఘ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్నానని సాయి మాధవ్ తెలిపారు. సభ్యులందరి  ఆమోధం తో నూతన కమిటీని అప్పటికప్పుడే ప్రకటించి కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం లో   బుఱ్ఱా జయలక్ష్మి (అధ్యక్షులు), ఆరాధ్యుల కోటేశ్వరరావు (గౌరవ అధ్యక్షుడు), గరికపాటి సుబ్బారావు (కార్యనిర్వాహక అధ్యక్షుడు), ఆరాధ్యుల ఆదినారాయణరావు (ప్రధాన కార్యదర్శి), ఎం.రామలింగేశ్వరరావు ( కార్యనిర్వాహక కార్యదర్శి), దీపాల సుబ్రహ్మమణ్యం (కోశాధికారి), ఉపాధ్యక్షులుగా శ్రీమతి బెజ్జంకి నాగమణి, శ్రీమతి నిర్మాలా రమేష్, పందిటి సుబ్బారావు, శరత్ వెంకయ్య, ముత్యాత లక్ష్మీ తులసి, సంయుక్త కార్యదర్శులుగా కనపర్తి మధుకర్, గోగినేని సుధీర్, మహబూబ్ సుభాని ఎంపిక కాగా కార్యవర్గ నూతన సభ్యులుగా బడుగు మోహనరావు, గోళ్ళ సుబ్రహ్మణ్యం, కొండమూది రమేష్, ఎస్.కె. షైదా, శ్రీమతి వేములవాడ సత్యవతి ఎంపికయ్యారు. క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, చెరుకుమల్లి సింగారావు, షేక్ జానిబాషా, న్యాయ సలహాదారుగా హరిదాసు గౌరీశంకర్, గౌరవ సలహాదారుగా ఉప్పాల రాజేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, టి.వి.ఎస్. శాస్త్రి, కనపర్తి బాబురావు, గోగినేని కేశవరావు, బొల్లిముంత కృష్ణ, చిట్లూరి సీతారామయ్య ఏకగ్రీకంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ పట్టణ రంగస్థల సంఘ కళాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం సాయశక్తులా కష్టపడి పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...