కుష్టురోగులకు సాయం చేయడమే సంతృప్తి

కుష్టురోగులకు సాయం చేయడమే సంతృప్తి
  - సినీ దర్శకుడు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పెదరావూరు, జూన్ 16: కుష్టురోగులకు సాయం చేయడoలో ఎOతో ఆత్మ సంతృప్తి ఉందని  సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.రూరల్ మండలం పెదరావురులోని పెన్నీ  మినిస్ట్రీస్  స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కుష్టురోగులకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులతో పాటుగా ఆర్థిక సహాయాన్ని  కూడా ఆయన అందజేశారు. పాస్టర్ మట్లపూడి జోషి దైవప్రార్ధన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సమావేశానికి సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి  అద్యక్షత వహించారు.తమకున్నదాంట్లో లేనివారికి సాయం చెయ్యాలనే సంకల్పంతో  2002 నుండి పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థ ఇప్పటి వరకు కుష్టురోగులకు,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు,వితంతువులకు సహాయం చేస్తు 22 సంవత్సరాలు కొనసాగటo వెనుక  ఉన్నతమైన లక్ష్యం దాగివున్నదని  ప్రదీప్ దోనేపూడి తెలిపారు.ప్రాధమిక స్థాయిలో కుష్టు వ్యాధిని గమనించి, గుర్తించి తగిన చికిత్సను డాక్టర్ ద్వారా తీసుకోవలసిందిగా ఆయా రోగులకు ఆయన సూచించారు.కార్యక్రమoలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన
 కుష్టురోగులు  పాల్గొనగా సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్, వెంకీ రావణ్ పర్యవేక్షించారు.