Skip to main content

స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు

స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు..
-మా-ఎపి' దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: జూన్ 8 : స్వయం కృషికి తొలిసంతకం రామోజీ రావు అని 'మా - ఎపి' వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయంలో  రామోజీ రావు సంతాప సభ నిర్వహించారు.   తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీనిర్మాత, రామోజీఫిలిమ్ సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు చిరస్మరణీయుడు అని నివాళులర్పించారు. నటుడు మిలటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్తున్నత ద్వితీయ పురస్కారం 'పద్మవిభూషణ్' అందించి దేశం ఆయనను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిమ్ సిటీని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగువారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన ఒరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగారనడంలో అతిశయోక్తి లేదని ఆయన కొనియాడారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ, అనంతరం మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, మనసుమమత, నువ్వే కావాలి లాంటి ఎన్నో క్లాసిక్ ను రామోజీ నిర్మించారని గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల 'మా- ఎపి’ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ముందుగా రామోజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో, నిర్మాత చదలవాడ హరిబాయి, సహాయ దర్శకుడు వెంకీ రావణ్, నటుడు వేమూరు విజయ భాస్కర్, ఇంటూరి విజయ భాస్కర్, మన్నె సత్యన్నారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...