'స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలి


స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలి'
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 సచివాలయంలోని రెండో బ్లాక్ లో పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలన్నారు. అన్ని రకాల సహకారాలు అందిస్తామన్నారు. ఎకో, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. పర్యాటక రంగం ద్వారా నిధులు సమకూర్చుకునేలా కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.