Skip to main content

యోగాతోనే ఆరోగ్యకరమైన జీవితం

యోగాతోనే ఆరోగ్యకరమైన జీవితం
-  ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌
_  విజ్ఞాన్స్‌లో ఘనంగా 10వ ఇంటర్నేషనల్‌ యోగా డే ఉత్సవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుందని ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో 10వ ఇంటర్నేషనల్‌ యోగా డేను ఈ సంవత్సరం ‘‘యోగా ఫర్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. యోగా డేను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా శారీరక శ్రమ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందుకు యోగా చక్కని మార్గమని విద్యార్థులకు తెలియజేసారు. చాలా మందికి వారి అస్తవ్యస్తమైన బిజీ జీవితాల నుంచి యోగా ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుందన్నారు.  మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా బాగా సహాయపడుతుందన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన  ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ జీవీఆర్‌ క్రిష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్‌ఫుల్‌నెస్‌ సాధనని పేర్కొన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుందన్నారు. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందన్నారు. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుందన్నారు. యోగ సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు కానీ శరీరానికి మంచి అనుభూతి అందించి, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుందన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరై ఇండస్ట్రియలిస్ట్‌ వీఆర్‌ శ్రీలక్ష్మి మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వలన బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులందరూ అష్టాంగ యోగాను త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లైతే మంచి రాజయోగంతో జీవిస్తారని తెలియజేసారు. కార్యక్రమంలో విజయవాడలోని యోగాసన స్పోర్ట్స్‌ స్టేట్‌ సెక్రటరీ పీ.ప్రేమ్‌ కుమార్, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...