పెమ్మసాని అనే నేను...

పెమ్మసాని అనే నేను...
- పార్లమెంటులో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా.. అంటూ సోమవారం ఉదయం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్త హరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భర్తు హరి మెహతాబ్క అభివాదం చేసారు. ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ తనకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో తనకు ఈ విజయం అందించిన గుంటూరు పార్లమెంట్ ప్రజానీకానికి ధన్యవాదాలు
తెలిపారు.