డిజిపిని కలిసిన దిలీప్ రాజా

డిజిపిని కలిసిన దిలీప్ రాజా
డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి ,జూన్ 29 : ఆంధ్రప్రదేశ్ నూతన  డిజిపి ద్వారక తిరుమల రావుని 'మా - ఎపి' వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీ గా భాద్యతలను తీసుకున్న ద్వారక తిరుమల రావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియకు తెలిపారు. ఆంధ్రాలో  మా - ఎపి  కార్యక్రమలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.ఈసందర్భంగా నిర్మాణంలో ఉన్న జగజ్జీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి గా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి ,సహాయ దర్శకుడు వెంకీ రావన్లను నూతన డీజీపీకి  పరిచయం చేసినట్లు  ఆయన వివరించారు.కాగా తెనాలిలో ని  మా - ఎపి కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు.