సమస్యల సాధనకు పోరు బాట పట్టాలి

సమస్యల సాధనకు పోరు బాట పట్టాలి..
- ఏపీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పిలుపు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రాష్ట్రంలో పాత్రికేయులుతీవ్ర సంక్షోభంలో ఉన్నారని
సమస్యల సాధనకు పోరాట పంధాయే మార్గమని ఏపీడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు  ఉద్బోధించారు.ప్రస్తుతం మీడియా యావత్తు ఇటు ప్రభుత్వం తోను అటు యాజమాన్య
పరంగా ఇక్కట్ల నెదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేసారు. ఏలూరు జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశం బుధవారం ఇక్కడి పి ఆర్ ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధ్యక్షుడు ఎస్ డి జబీర్ ఆధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు విలేకరుల సాధక బాధలు ప్రస్తావించారు. వారు నడిరోడ్డుపై ఉన్నారని నూతన కూటమి ప్రభుత్వం నాలుగు దశాబ్దాల పరిపాలనానుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు సారధ్యం లో ఏర్పడిందని అభినందించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,
మంజూరు విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చివరిరోజు వరకు మభ్య పెట్టారని ఆవేదన చెందారు. చంద్రబాబు గత ప్రభుత్వం లో ప్రతి విలేఖరికి మూడు సెంట్ల ఇంటి స్టలం, నంద్యాల ఉప ఎన్నికల సమయం లో
త్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లుకట్టిస్తా మని హామీ ఇచ్చి
పట్టించుకోలేదని గుర్తు చేశారు.చివర్లో జర్నలిస్టుల
ఇళ్ల స్థలాల పధకాన్నిరూ100 కోట్లు మొదలు పెట్టి
పూర్తి స్థాయిలో అమలు చేయడం జరగలేదని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం లో సెంటు సెంటున్నర  అని
తరువాత 40 శాతం వాటా అని జీవో కూడా ఇచ్చి అమలు చేయకుండా వదిలేసినట్టు తెలిపారు.రెండు ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఆశపెట్టి కోడ్ సాకుతో ఫైల్  పక్కన పెట్టేసారని ఆరోపించారు.సానుకూల దృక్పథంతో
ముందుకు సాగుదాం నూతన  కూటమి ప్రభుత్వం
తో సానుకూలంగా ముందుకు వెళదాం అని ఆంజనేయులు
పేర్కొన్నారు. సమాచార శాఖ మంత్రి పార్ధ సారథి ని రాష్ట్ర
బాధ్యులు గా కలిసి సమయం కోరామని చెప్పారు. హోమ్
తదితర శాఖల వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశామన్నారు.కాగా సమావేశంలో మాట్లాడిన
రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకరరావు జిల్లాలో ఆయా నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యేలను కలిసి
పరిచయం చేసుకోవాలని తద్వారా సమస్యలు  తెలీజెయ్యాల్ని చూచించారు. సమావేశంలో నూతన ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు.గతం లో
మాదిరిగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్
లు ఇవ్వాలనిమరో తీర్మానం చేశారు. కార్యదర్శి వై వి హరీష్ తీర్మానాలు ప్రవేశ పెట్టారు. దెందుల్తూరు కార్యదర్శి
వెంకట్ స్వాగతం పలికారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కె బాల సౌరి,ఏ.కొండబాబు ఉపాధ్యక్షులు,కె సోమ శేఖర్, కె.కిరణ్ కుమార్, కలపాల శ్రీనివాస్, ఋషీ రావు కోశాధికారి చిన్నారావు, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ రామకృష్ణ, పి ఎన్వీ రామారావు,కె.లోకేష్ తదితరులు పాల్గొన్నారు.