తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన మనోహర్

 తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన మనోహర్ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఉమ్మడి రాష్ట్రాల మాజీ సభాపతి,జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపి, స్వేచ్ఛగా మాట్లాడే వారిపై కేసులు పెట్టి, ఇబ్బందులు పాలు చేశారని అన్నారు. తమ పార్టీ అధినేత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా,వారి ఇబ్బందులను తెలుసుకుని అండగా ఉన్నామని,అన్నారు. ఆస్పత్రుల్లో సరైన వైద్యం లేదని, ప్రజా జీవితంలో ప్రజలు కోరుకున్న విధంగా నాయకులు నేర్చుకోవాల్సింది మంచి పరిపాలన అందించాలని ఆశిస్తారని, తమ నాయకత్వం మీద నమ్మకం ఉంచి అద్భుతమైన మెజార్టీ అందించి, తమకు బరువు బాధ్యతలు పెంచారని అన్నారు. ఇంత సుదీర్ఘమైన తమ ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించారని, ప్రజలు కోరుకున్నట్టుగా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేసే విధంగా అలాగే గంజాయిని పూర్తిగా నిర్మూలించే విధంగా, పనిచేస్తామన్నారు. తమ మెనిఫేస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను తప్పకుండా అమలుపరిచి తీరుతామని, అన్నారు. తనతో పాటు,గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజానీకానికి, ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ , తెలుగుదేశం పార్టీ, బిజెపి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, జనసేన వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, నన్నపనేని రాంబాబు , న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ తదితరులున్నారు.