విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్‌ కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్, విజ్ఞాన్‌ టీబీఐ, ఈసెల్, హెడ్‌స్టార్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘భారత్‌ పిచథాన్‌ 3.0’’కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘అన్‌ఎర్తింగ్‌ స్టార్టప్స్‌ ఫ్రమ్‌ భారత్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌ను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్టార్టప్‌ల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ముఖ్య అతిథిగా హాజరై పారిశ్రామికవేత్తలతో సంభాషించి వారిని ప్రోత్సహిస్తూ, పారిశ్రామికవేత్తలకు విజ్ఞాన్‌ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంది వెంచర్స్‌తో ఎంవోయూపై సంతకం చేశారు. అనంతరం ఎంవోయూ పత్రాలను నాంది వెంచర్స్‌ కోఫౌండర్‌ వికాస్‌ కాట్రగడ్డకు అందజేసారు. హెడ్‌స్టార్ట్‌ నిర్వహించిన ఈ భారత్‌ పిచాథాన్‌ 3.0 ద్వారా పారిశ్రామికవేత్తలను వారి వెంచర్‌లను కొనసాగించడానికి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వృద్ధికి దోహదపడింది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి మరియు పరిశ్రమ నిపుణులు మరియు పెట్టుబడిదారులతో కనెక్ట్‌ అవ్వడానికి ప్లాట్‌ఫారమ్‌లను అందించడం ఈ ఈవెంట్‌ ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజోర్‌పే కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్స్‌ లీడ్‌ ఈషిత మహేశ్వరి మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి కావలసిన ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తామన్నారు. ఎవరికైనా కొత్త ఐడియాలు ఉన్నట్లైతే వాటిని వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నారు. దేశంలో వివిధ రకాల ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్థాపిస్తేనే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్‌ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. హెడ్‌స్టార్ట్‌ ఫౌండేషన్‌ ఏపీ లీడ్, అవసర్షాల కోఫౌండర్‌ అశ్వతి వేణుగోపాల్‌ మాట్లాడుతూ చిన్న చిన్న ఆలోచనలకు టెక్నాలజీను జోడించడం ద్వారా పెద్ద బిజినెస్‌గా మార్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో  జెల్ప మాక్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జరన్‌ భగ్వాగర్, ఏజీఆర్‌ కార్పొరేట్‌ కన్సల్టంట్స్‌ సీఈవో వరుణ్‌ ఏజీ రెడ్డి, నాంది వెంచర్స్‌ కోఫౌండర్‌ వికాస్‌ కాట్రగడ్డ,  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.