Skip to main content

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్‌ కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్, విజ్ఞాన్‌ టీబీఐ, ఈసెల్, హెడ్‌స్టార్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘భారత్‌ పిచథాన్‌ 3.0’’కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘అన్‌ఎర్తింగ్‌ స్టార్టప్స్‌ ఫ్రమ్‌ భారత్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌ను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్టార్టప్‌ల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ముఖ్య అతిథిగా హాజరై పారిశ్రామికవేత్తలతో సంభాషించి వారిని ప్రోత్సహిస్తూ, పారిశ్రామికవేత్తలకు విజ్ఞాన్‌ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంది వెంచర్స్‌తో ఎంవోయూపై సంతకం చేశారు. అనంతరం ఎంవోయూ పత్రాలను నాంది వెంచర్స్‌ కోఫౌండర్‌ వికాస్‌ కాట్రగడ్డకు అందజేసారు. హెడ్‌స్టార్ట్‌ నిర్వహించిన ఈ భారత్‌ పిచాథాన్‌ 3.0 ద్వారా పారిశ్రామికవేత్తలను వారి వెంచర్‌లను కొనసాగించడానికి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వృద్ధికి దోహదపడింది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి మరియు పరిశ్రమ నిపుణులు మరియు పెట్టుబడిదారులతో కనెక్ట్‌ అవ్వడానికి ప్లాట్‌ఫారమ్‌లను అందించడం ఈ ఈవెంట్‌ ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజోర్‌పే కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్స్‌ లీడ్‌ ఈషిత మహేశ్వరి మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి కావలసిన ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తామన్నారు. ఎవరికైనా కొత్త ఐడియాలు ఉన్నట్లైతే వాటిని వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నారు. దేశంలో వివిధ రకాల ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్థాపిస్తేనే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్‌ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. హెడ్‌స్టార్ట్‌ ఫౌండేషన్‌ ఏపీ లీడ్, అవసర్షాల కోఫౌండర్‌ అశ్వతి వేణుగోపాల్‌ మాట్లాడుతూ చిన్న చిన్న ఆలోచనలకు టెక్నాలజీను జోడించడం ద్వారా పెద్ద బిజినెస్‌గా మార్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో  జెల్ప మాక్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జరన్‌ భగ్వాగర్, ఏజీఆర్‌ కార్పొరేట్‌ కన్సల్టంట్స్‌ సీఈవో వరుణ్‌ ఏజీ రెడ్డి, నాంది వెంచర్స్‌ కోఫౌండర్‌ వికాస్‌ కాట్రగడ్డ,  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...