సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు

సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేషు శనివారం రాష్ట్ర సెక్రటరియెట్లో మా-ఎపి (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, 24 విభాగాల యూనియన్) ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఎపిలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రితో చర్చించిన ప్రధాన అంశాల వివరాలను స్థానిక “మా-ఎపి” కార్యాలయంలో మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా శనివారం వెల్లడించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణ చర్చలు తీసుకోవలసిందిగా కోరినట్లు ఆయన తెలిపారు. అమరావతి సినిమా స్టూడియోస్ పేరుతో అమరావతిలో వంద ఎకరాలలో ప్రభుత్వమే స్టూడియోను నిర్మించాలని అలాగే రాజమండ్రి, విశాఖపట్నం బీబ్, తిరుపతిలలో కూడా స్టూడియోలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిన నిర్మాతలకు కనీసం పదిఫ్లోర్లకు తగ్గకుండా ఏర్పాటుచేసుకొనేందుకు తగిన చర్యలను తీసుకొవాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటుల, సాంకేతిక నిపుణులకు అమరావతిలోనే ఇండ్లస్థలాలను కేటాయించాలని కొరినట్లుగా దిలీవ్రాజా వివరించారు. ఆంధ్రలో 1090 తెలంగాణాలో 485 సినిమా ధియేటర్లు ఉన్నప్పటికీ ఆంధ్రలో ఆయా ధియేటర్లు మూతబడకుండా ప్రభుత్వం ఆయకోవాల్సిన అవసరం వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. తామ తెలంగాణాకు గానీ వేరెవ్వరికీ గానీ వ్యతిరేకులం కాదని ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రం తమ ఏకైక ఏజండా అని ఆయన స్పష్టం చేశారు.
సినిమాటోగ్రఫీ చట్టం 1952 మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రనర్విభజన చట్టం 2014లో గల 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూల్సులో రాష్ట్రానికున్న స్వయంప్రతిపత్తి మేరకు ఆంధ్రలో సినీపరిశ్రమను అభివృద్ధి చేయవలసిందినా మా-ఎపి రూపొందించిన ప్రతిపాదనలను సినిమాటోగ్రఫీ మంత్రికి అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో భవానీద్వీపం (విజయవాడ) కోనసీమ, గోదావరి తీరం, లంబసింగి, అరకులోయ, జలపాతాలు, సముద్ర తీరాలు, అడవులు, పచ్చటి పంటపొలాలు, ఇలా ఎన్నో లొకేషన్లు నిర్మాతలకు అందుబాటులో వున్నాయిని ఆయన వివరించారు. పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్లు ఆంధ్రవారే మూడోంతులు వున్న నేపధ్యంలో జన్మభూమిపై మమకారంతో ఆంధ్రప్రదేశ్లో సినీపరిశ్రమ అభివృద్ధికి ఆయా సినీపెద్దలు పెద్దమనసుతో ముందుకు రావాలని కోరారు. నటుడు మీసాల భాస్కర్ మాట్లడుటు చిన్న సినిమాలను బ్రతికించవలసినదిగా మంత్రిని కోరినట్లు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మా ఎపి జరిపిన చర్చల్లో నటుడు మిలటరీ ప్రసాద్, హీరోయిన్ టీనా చౌదరి, మన్నె సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.