నిరుపేద గిరిజనులకు అంజలి నిత్యావసరాలు పంపిణి

నిరుపేద గిరిజనులకు అంజలి నిత్యావసరాలు పంపిణి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి,జూలై 4 : స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో  యానాది సామాజికవర్గoలోని నిరుపేదలకు ట్రైబల్స్ మినిస్ట్రీ అధ్యక్షులు అంజలి రావూరి గురువారం నిత్యావసరాలను పంపిణిచేశారు.ఆయా గిరిజనుల బిడ్డలను పాఠశాలలో  చేర్చవలసిందిగా ఆమె గిరిజనులకు సూచించారు.బడులకు పంపకుండా పనులకు పo పించడం వలన పిల్లల జీవితాలు బ్రతికున్నంతకాలం ప్రశ్నార్ధకం  అవుతాయని ఆమె  చెప్పారు.ఇప్పటికే తరతరాలుగా యానాది సామాజవర్గానికి చెందిన కుటుంబాలు చెట్లకిందో.. పాముల పుట్టల పక్కనో నివాసం ఉంటు జీవితకాలం నిరాశ్రయులుగా బ్రతికేస్తున్నారనే  ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు.అందుకే ప్రతి మనిషి తలరాతను చదువు మార్చెస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఈసందర్భంగా పాఠశాలలో చేరిన 13 మంది గిరిజన బాలబాలికలకు ఆధార్ కార్డు మంజూరు కోసo యoఈవో  ద్వార తగిన చర్యలను తీసుకున్నట్లుగా అంజలి తెలిపారు.కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, ఇంటూరు విజయ భాస్కర్ ,దోనేపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.