Skip to main content

విజ్ఞాన్స్‌ వర్సిటీ లైబ్రేరియన్‌కు అయ్యంకి వెలగా పురస్కారం

విజ్ఞాన్స్‌ వర్సిటీ లైబ్రేరియన్‌కు అయ్యంకి వెలగా పురస్కారం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయ అధికారిణి  ఆచంట రజనీకుమారికు గ్రంథాలయ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యల పేర్లతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారం అందుకున్నారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ కేజీ శంకర్, డాక్టర్‌ ఆరేటి కృష్ణకుమారీలు చేతుల మీదుగా గ్రంథాలయ పురస్కారంతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారని వెల్లడించారు. ఆచంట రజనీకుమారి గడిచిన 28 సంవత్సరాలుగా లైబ్రేరియన్‌గా ఎంతో విలువైన సేవలు అందించారని, వర్సిటీలో డిజిటల్‌ లైబ్రరీను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్స్, అధ్యాపకులకు అవసరమైన పుస్తకాలను, పరిశోధన పత్రాలను అందజేయడంలో చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించిందన్నారు. ఎన్‌టీర్‌ విజ్ఞాన్స్‌ వర్సిటీ లైబ్రరీలో 1,15,000 పుస్తకాలు, 2 లక్షల ఈ–బుక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఏపీఎల్‌ఏ శాశ్వత సభ్యురాలిగా గుర్తింపు పొందటంతో పాటు అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని గ్రంథాలయ అభివృద్ధిపై అనేక పత్రాలను సమర్పించారని తెలియజేసారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ఒక జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, 4 జాతీయ వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారని వెల్లడించారు. అయ్యంకి వెలగా పురస్కారం అందుకున్న ఆచంట రజనీకుమారి మాట్లాడుతూ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యల పేర్ల మీదుగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారానికి ఎంపిక చేసిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం నా మీద మరింత బాధ్యతను పెంచడంతో పాటు గ్రంథాలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రంథాలయ సేవలను మరింత చేరువ చేస్తానని హామీనిచ్చారు. అనంతరం గ్రంథాలయ పురస్కారం అందుకున్న ఆచంట రజనీకుమారిను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...