Skip to main content

10 లక్షల ఇంటి భోజనాలని సరఫరా చేసిన షీరో హోమ్ ఫుడ్

10 లక్షల ఇంటి భోజనాలని సరఫరా చేసిన షీరో హోమ్ ఫుడ్ 
- మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతున్న షీరో 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
హీరో లాగా షీరో తన కాళ్లపై తాను నిలబడి తనకు తెలిసిన వంట నైపుణ్యానికి సంస్థ అందించే మెళకువలను జోడించి ఇంటి భోజనాన్ని తయారు చేస్తూ ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ పొందుతూ ప్రతినెలా మహిళలు తమ ఇంటినుండే స్థిరమైన ఆదాయాన్ని పొందేలా విశిష్ట అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ షీరో హోమ్ ఫుడ్. ఒక్క కిచెన్ తో ప్రారంభమైన షీరో నేడు దక్షిణ భారత దేశంలో 2000 లు పైబడి కిచెన్స్ తో ఓ అతిపెద్ద మహిళా సాధికారికతా సంస్థగా ఆవిర్భవించింది. నాలుగో సంవత్సరంలో అడుగిడిన ఈ సంస్థ విజయోత్సవంలో మరో మైలురాయిని చేరుకుంది.ఇప్పటికి 10 లక్షల మందికి రుచికరమైన సుచికరమైన శాఖాహార భోజన పదార్థాలని డెలివరీ చేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తిలక్ వెంకటస్వామి , జయశ్రీ తిలక్ లు ప్రారంభించిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్న సువర్ణా దేవి పాకలపాటి మాట్లాడుతూ : వ్యాపారం చేయడం వేరు, పది మందికి ఉపయోగపడే వ్యాపారం చేయడం వేరు, అందులోను మహిళగా సాటి మహిళలకి చేదోడు వాదోడుగా వుండే వ్యాపారం మరింత సంతృప్తిని ఇస్తోంది ఆ అనుభూతే షీరో హోమ్ ఫుడ్ తో కలుగుతోంది , ఇప్పుడు ఈ సంస్థ ఇటుడింతై పటుడింతై అన్నట్లుగా ఎదిగి గృహిణులు తయారు చేసిన వంటకాలు 10 లక్షల మందికి చేరువకావడం , అలాంటి సంస్థలో తాను సైతం భాగస్వామ్యంగా ఉండటం గొప్ప అనుభూతి అనేకంటే ఓ పెద్ద జీవిత సాఫల్యం అని అన్నారు. సంస్థలో చేరి చక్కని స్వయం ఉపాధి పొందగోరు మహిళలకు వంటలపైనే కాకుండా టెక్నాలజీ లో సైతం శిక్షణను ఇస్తున్నామని ఆసక్తి కలవారు ఉచిత సెమినార్ లో హాజరు అయ్యేందుకు 6309527444 నెంబర్ కి తమ పేరు ఏరియా సిటీ ని వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సువర్ణాదేవి పాకలపాటి తెలియజేసారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...