Skip to main content

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం వారు  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) చేసుకున్నారని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఓయూకు సంబంధిన అవగాహన పత్రాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ సౌత్‌ ఏసియా రీజనల్‌ డైరక్టర్‌ అరుణాచలం, సౌత్‌ ఇండియా డీజీఎం కార్తి సుబ్రమణియన్‌కు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అందించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటగా తమ యూనివర్సిటీలోనే ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతున్నారని తెలియజేసారు. అంతేకాకుండా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కేంబ్రిడ్జి సెంటర్‌ను, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ పార్టనర్స్‌ను, పారిశ్రామికవేత్తలను కేంబ్రిడ్జి వారు ఇక్కడికి తీసుకువచ్చి విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యేలా చేస్తారని పేర్కొన్నారు. పరిశోధనల్లో సహకారం అందించడం, విద్యార్థుల భాషా నైపుణ్యంపై కేంబ్రిడ్జ్‌ సర్టిఫికేషన్‌ పరీక్షల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఉమ్మడి ప్రాజెక్ట్‌ ఇప్పటికే పురోగతిలో ఉందని వెల్లడించారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి, ఉన్నత స్థాయి శిక్షణ, ధృవీకరణను అందించే మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు. న్యూ లింగ్వాస్కిల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష వలన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల ఆంగ్ల స్థాయిలను తనిఖీ చేయవచ్చునన్నారు. మాడ్యూల్స్‌లో మాట్లాడటం, రాయడం, చదవడం మరియు వినడం అనే నాలుగు భాషా నైపుణ్యాలను పరీక్షిస్తుందన్నారు. కొన్నేళ్లుగా కేంబ్రడ్జి యూనివర్సిటీ నిర్వహిస్తున్న సర్టిఫికేషన్‌ కోర్సులకు తమ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారుని, దాదాపు వంద శాతం మంది ఉత్తీర్ణులవుతున్నారని వెల్లడించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కోర్సుల ఫలితంగా ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆంగ్ల భాషను నేర్చుకోగలుగుతున్నారని చెప్పారు. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా అందుతున్నట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోనికి తీసుకుని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. కార్యక్రమంలో కేంబ్రడ్జి కార్పొరేట్‌ రిలేషన్స్‌ రీజనల్‌ మేనేజర్‌ పద్మజ శివకుమార్, ఈఎల్‌టీ మేనేజర్‌ మలికార్జున నాయుడు పచిపాల, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...