సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చల్లో పాల్గొన్న మా ఏపి నిర్వహకులు దిలీప్ రాజా

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చలు జరుపుతున్న దిలీప్ రాజా,శ్రీనివాస్ యాదవ్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష జరపడానికి అంగీకరించినట్లుగా 'మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈమేరకు అమరావతి సచివాలయంలో దిలీప్ రాజ తో పాటు మరో దర్శకుడు అచ్చన  శ్రీనివాస్ యాదవ్ తో  సినిమాటోగ్రఫీ మంత్రితో  చర్చలు జరిపినట్లుగా దిలీప్ రాజ చెప్పారు. బుధవారం
 తెనాలిలో విలేకరులకు చర్చల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉచితంగా లోకేషన్లు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణo,సినీ కార్మికులకు ఇండ్ల స్థలాలు,ఆంధ్రలో సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థలకు సబ్సిడి పెంపుదల తదితర ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి సినిమాటోగ్రఫీ మంత్రి  సమీక్ష జరుగుతోందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై  సినీ ప్రముఖులతో జరిగే తదుపరి సమావేశానికి మా-ఏపి ని ఆహ్వానిస్తామనిమంత్రిహమీఇచ్చినట్లుచెప్పారు.సినిమాటోగ్రఫీ మంత్రితో సమావేశమైనవారిలో ఇంటూరి విజయభాస్కర్,  వెంకటేశ్వర్లు ఉన్నారు.