Skip to main content

Posts

Showing posts from September, 2024

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఇంకుబేషన్‌ సెంటర్‌ ప్రారంభం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఇంకుబేషన్‌ సెంటర్‌ ప్రారంభం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్, యూఎస్‌ఏఐడీ, సిఫార్, వరల్డ్‌ ఆగ్రోఫారెస్ట్రీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘ట్రీ బేస్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ను (టీబీఈఐసీ)’’ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఇంకుబేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండియాలోని యూఎస్‌ఏఐడీ జనరల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ టెగెన్‌ఫెల్‌డెట్‌ మార్క్‌ హాజరై సెంటర్‌ను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రీ బేస్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఘనత విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా విజ్ఞాన్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ దేశంలోనే రెండవ అత్యధికమైన ఇంకుబేషన్‌ సెంటరని తెలియజేసారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు జనాభా ప్రయోజన...

ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి

ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి    -  చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజాందరణి  - విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన ఐసీఎన్‌ఏఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇంజినీరింగ్‌ విద్యార్థులు వారి బ్రాంచిలకు సంబంధించిన సబ్జెక్టులపైనేకాకుండా ప్రాథమిక సైన్స్, మేథమేటిక్స్‌ విషయాలపై అవగాహనతో ఉంటే ఎంతో మంచిదని చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజాందరణి తెలిపారు.. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం, సెర్బ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌–లీనియర్‌ అనాలిసిస్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ (ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) శనివారం ఘనంగా ముగించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజా...

'హ్యారీ పోటర్ ' నటి మృతికి ' మా.. ఏపి' సంతాపం

' 'హ్యారీ పోటర్ ' నటి మృతికి ' మా.. ఏపి' సంతాపం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  తెనాలి: సెప్టెంబర్ 28 : ప్రముఖ బ్రిటీష్  నటీ ఆస్కార్ గ్రహీత మాగ్ స్మిత్ (89) మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా 'మా ఎపి' వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా శనివారం పాత్రికేయులకు తెలిపారు. హ్యారీపోటర్ చిత్రంలో విశేష నటన చేసిన ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకురావడమే కాకుండా రెండు సార్లు ఆస్కార్ అవార్డును, నాలుగు పర్యాయాలు బ్రిటిన్ 'ఎమ్మి' అవార్డులను సొంతం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం లో అతికొద్ది నటీనటులు మాత్రమే ఈ గౌరవం దక్కించుకున్నారని ఆయన వివరించారు. 1956లోనే సినీకెరీర్ ను ప్రారంభించిన మాగ్ స్మిత్ షేక్స్పియర్ నాటకాల లోనూ, సినిమాలు, టీవీ షో లలో నటించారని దిలీప్ రాజా చెప్పారు. హ్యారీ పోటర్ ' భారతదేశంలో కూడా విడుదల కాగా అందులో ప్రొఫెసర్ మెక్ నాగల్ పాత్రలో ప్రపంచం దృష్టి తనవైపుకు మరలించిన ఆమె మృతి సినీ జగత్తుకి తీరనిలోటని ఆయన అన్నారు. మ్య...

తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సచ్చిదానంద మూర్తిదే

తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సచ్చిదానంద మూర్తిదే -  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత పద్మవిభూషణ్‌ సచ్చిదానంద మూర్తి గారిదేనని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌ విజ్ఞాన్‌ లైబ్రరీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సచ్చిదానంద మూర్తి గుర్తుగా తమ యూనివర్సిటీ లైబ్రరీలో ఆయన పేరు మీద ఇప్పటికే ఒక బ్లాక్‌ను ఏర్పాటు చేశామన్నారు. సామాన్యులకు తత్వశాస్త్రాన్ని విపులంగా అర్థమయ్యేటట్లు వివరించడంలో ఆయన ఎనలేని కృషి చేశారని...

సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం

సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం   - ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ - విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎన్‌ఏఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నాన్‌ లీనియర్‌ అనాలిసిస్‌తో ఆవిష్కరణలను, పరిశోధనలను వేగంగా తీసుకెళ్లటంతో పాటు ఖచ్చితత్వం కలిగించి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం, సెర్బ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌–లీనియర్‌ అనాలిసిస్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ (ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) గురువారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం ‘‘ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024’’కు సంబంధించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు.  కార్యక్రమానికి ముఖ్య ...

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ.5 లక్షల విలువ కలిగిన గృహ సామాగ్రి పంపిణీ

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ.5 లక్షల విలువ కలిగిన గృహ సామాగ్రి పంపిణీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో తాడేపల్లి లోని వరద బాధితులకు రూ.5 లక్షల విలువగల గృహ సామాగ్రి పంపిణీ చేశామని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పాల్గొని గృహ సామాగ్రితో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ ఇటీవల వరద ప్రాంతాల్లో ముంపుకు గురైన తాడేపల్లి మండలంలోని నులకపేట సమీప ప్రాంతాల్లోని 500 కుటుంబాలకు గృహ సామాగ్రి పంపిణీ చేశామన్నారు. ఈ గృహ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నులకపేట ప్రాంతంలోని చైతన్య తపోవన్ శ్రేయో కళ్యాణ మండపంలో నిర్వహించామన్నారు. ఈ గృహ సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో యూనివర్సిటీకి చెందిన 300 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, ఆధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమే

చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమే - ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రావూరి అంజలి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి రూరల్, సెప్టెంబర్ 25:చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమౌతున్నాయని ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్  రావూరి అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. గతరెండు వారలుగా ఎడతెరుపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తిండిలేక,ఉండటానికి వసతిలేక సాయంకోసం  ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు .ఈసందర్భంగా రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని కాలువకట్టలపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున బాధితులకు  బుధవారం  ఆమె  నిత్యావసరాలను పంపిణిచేశారు.అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో  భారీ వర్షాల కారణంగా తలదాచుకున్న సంచార కుటుంబాలకు దుప్పట్లు, నిద్రించడానికి చాపలను అందజేసినట్లుగా అంజలి తెలిపారు.పంపిణి కార్యక్రమoలో సంస్ధ  డైరెక్టర్ రావూరి సురేష్ బాబు, వాలంటరీలు  ఇంటూరి విజయభాస్కర్, బందెల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఫోటో  రైటప్  నిత్యావసరాలను పంపిణి చేస్తున్న  రావూరి అంజలి

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి  - గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ (ఐఏఎస్‌) -  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే ఉత్సవాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులందరూ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని యూఈఏసీ (యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌ యాక్టివిటీ కౌన్సిల్‌) విద్యార్థుల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా సమాజానికి వీలైనంత సేవ చేయాలని, పది మందికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. అంతేకాకుండా యూనివర్సిటీ పరిధిలోని 5 గ్రామాలను ( శలపాడు, వడ్లమూడి, వీరనాయకునిపాలెం, వేజండ్ల, సుద్దపల్లి) దత్తత తీసుకుని సంవత్సర కాలంలో 107 సామాజిక ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని సోమవారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ విద్యాసాగర్‌ దొంతినేనితో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షా...

చైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీం కోర్టు తీర్పు కీలకం

చైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీం కోర్టు తీర్పు కీలకం --- సినీ దర్శకుడు దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, సెప్టెంబర్ 23 : పిల్లలు అశ్లీల వీడియోలను చూడటం, డౌన్‌లోడ్ చేయడo నేరం కాదన్న తమిళనాడు హైకోర్ట్ ఉత్తర్వులను   సుప్రీoకోర్టు తోసిపుచ్చడం భారత దేశంలో పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి గుండెలమీదున్న కుంపటిని దించడమేనని సినీ దర్శకుడు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తo చేశారు.స్థానిక  మూవీ   ఆర్టిస్టు   అసోసియేషన్   ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోక్సో చట్ట ప్రకారంగా పిల్లలు పోర్న్ వీడియోలు చూడటం డౌన్‌లోడ్ చేయడం నేరమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయం అన్నారు.చెన్నై హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తు ఓ తండ్రి సుప్రీo  కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.దీనిపై సుప్రీం తీర్పు భారత దేశ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తు పిల్లల రక్షణపై ప్రత్యేక శ్రద్ధవహించినదన్నారు.అందుకుగాను సుప్రీo ధర్మాసనానికి భారతీయుడిగా చేతులుజోడించి నమస్కరిస్తున్నానని...

రేపు డాక్టర్ కత్తి పద్మారావుకు మన కాలపు జాషువా పురస్కార ప్రదానం

రేపు డాక్టర్ కత్తి పద్మారావుకు  మన కాలపు జాషువా పురస్కారం  ప్రదానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారా వుకు ఖమ్మానికి చెందిన జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'మన కాలపు జాషువా' పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ శుక్రవారం సాయంత్రం తెనాలిలోని సేవా ట్రస్ట్ కార్యాలయంలో విలేక రుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన పొన్నూరులోని లుంబినీవనం లో కార్యక్రమం ఉంటుందన్నారు. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్ర మంలో అంబేడ్కర్ వాదులు, దళిత మహాసభ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సం ఖ్యలో పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావే శంలో అంబేడ్కర్ సేవా ట్రస్ట్ కార్యదర్శి దోబా సం దీప్, ట్రెజరర్ పాముల దాసు, కనపర్తి ఎజ్రా, కొండ్రు రవీంద్ర, కనపర్తి చిట్టిబాబు, బ్రూస్లీ తదితరులు పాల్గొన్నారు.

శత వసంతాల అక్కినేని

శత వసంతాల అక్కినేని 'నటసమ్రాట్' అక్కినేని శతజయంతి నేడే. గత సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి అక్కినేని కోలాహలం మొదలైంది.ప్రపంచమంతా వాడవాడలా విశేషంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణలతో కన్నులపండువగా ఈ సంబరాలు సాగుతున్నాయి. తెలుగు జన హృదయ సామ్రాజ్యాలను దోచుకున్న 'నటసమ్రాట్' అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు.తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం,తానే గీసుకున్న అందమైన 'చిత్రం'. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని,జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి,జీవించిన నిత్య అధ్యయనశీలి.చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం.తను రాసిన  'అ ఆలు..' చదివితే చాలు, అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది.ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండుజీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు, కళాప్రపూర్ణుడు.భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం.సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వా...

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 అధ్యాపకులు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్‌ అంబటి రంగారావు, డాక్టర్‌ కే.చంద్రశేఖర్, మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్, ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ రుద్రపాల్‌ మిథున్, అడ్వాన్డ్స్‌ సీఎస్‌ఈ విభాగానికి చెందిన డాక్టర్‌ జోత్న్సాదేవి బోడపాటి, కెమికల్‌ విభానికి చెందిన ప్రొఫెసర్‌ టీ.సుబ్బయ్యలు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారు 2023 సంవత్సరం వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్‌ సైన్స్‌ మేట్రిక్స్‌ క్లాసిఫికేష...

అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి

అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి  - శతజయంతి వేడుకల్లో 'మా-ఎపి'తీర్మానo. - భారతప్రభుత్వానికీ 'మా-  ఎపి' వినతి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, సెప్టెంబర్ 20 : అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సoదర్భంగా అయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా 'మా- ఎపి'  తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్ట్యున్  కల్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శతజయంతి వేడుకలు జరగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా అయన తెలిపారు.నటిoచిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వ విద్యాలయంగా ఆయన అభివర్ణించారు.తాగుబోతులను,ప్రేమలో  ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికీ సంభోధిస్తున్నారంటే ఆపాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోను,మహాసముద్రమంత వైశాల్యంలో ఉండటo జగమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు.దేవదాసు,ప్ర...

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ ఏర్పాటు

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ ఏర్పాటు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ నూతనం గా ఏర్పాటయింది. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో  గురువారం సాయంత్రం జరిగిన సమావేశం లో కమిటీని ఎంపికచేశారు. సమావేశానికి ఫెడరేషన్ నాయకులు ఎస్.ఎస్. జహీర్ అధ్యక్షతన వహించారు. జిల్లా కన్వీనర్ గా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ఈస్ట్ కో కన్వీనర్లు గా పి. సాయి కుమార్, వరదల మహేష్  గుంటూరు వెస్ట్ కో కన్వీనర్లు గా అజయ్ ఇండియన్, వేముల రాజేష్, తెనాలి కో కన్వీనర్ గా ఎమ్. శ్రీకాంత్, పొన్నూరు కో కన్వీనర్లు గా అత్తోట సంజయ్, కె.కృష్ణ, మంగళగిరి కో కన్వీనర్ గా చింతా మణి కుమార్, తాడికొండ కో కన్వీనర్లు గా ఎన్. జె.శామ్యూల్, సయ్యద్ కరిముల్లా, పత్తిపాడు కె. పుల్లారావు లు ఎంపికయ్యారు. త్వరలో ఫెడరేషన్ జిల్లా మహాసభ జరగనుందని నూతనం గా కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన రత్నాకర్ తెలిపారు. సమావేశం లో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతేపల్లి గాయత్రికు తమ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ యాన్‌ ఎంపిరికల్‌ స్టడీ ఆన్‌ డీప్‌ లెర్నింగ్‌ బేస్డ్‌ ఎన్‌సెంబుల్‌ క్లాసిఫైర్స్‌ ఫర్‌ నెట్‌వర్క్‌ అనోమలీ డెటెక్షన్‌’’ అనే అంశంపై పరిశోధన చేసిందని తెలియజేసారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ విభాగంలోని మాజీ ప్రొఫెసర్‌ బీ.ప్రేమామయుడు గైడ్‌గా వ్యవహరించారు.  ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్‌సీఐఈ పేపర్,  2 స్కూపస్‌ పబ్లికేషన్స్, 2 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన కేతేపల్లి గాయత్రిను విజ్ఞాన్స్‌...

నేటి కేబినెట్లో సినిమాపై చర్చించండి

నేటి కేబినెట్లో సినిమాపై చర్చించండి . -ముఖ్యమంత్రికి ' మా - ఎపీ' బహిరంగ లేఖ  మా _ ఎపి' దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, సెప్టెంబర్ 17: బుధవారం జరుగుతున్న రాష్ట్ర మంత్రిమండలి కేబినెట్  స‌మావేశంలో సినిమా ప‌రిశ్ర‌మ పై ప్ర‌తిపాదిత అంశాల గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌వ‌ల‌సిందిగా మూవీ  ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్  వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. స్థానిక 'మా _ ఎపి' కార్యాలయంలో మంగళవారo ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థను సమాచారశాఖలో నుండి విడతీసి పర్యాటక,సాంస్కృతిక శాఖల్లో విలీనం చేస్తే ప్రయోజనాలు అధికంగా ఉంటాయన్నారు.సినిమా షూటింగ్ లోకేషన్ లన్ని  టూరిజంశాఖ పరిధిలోనే ఉన్నందువలన అనుమతుల కోసం కాలయాపన జరగదని ఆయన స్పష్టం చేశారు.గతంలో ప్రకటించిన నంది అవార్దులను అందజేస్తూ ప్రస్తుతకాలానికి నంది అవా ర్దులను ప్రకటించాలని ఆయన కోరారు. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను న్యాయనిర్ణేతల కమిటీలో నియమించాల్సిందిగా ఆయన సూచించారు.సినిమా పరిశ్రమను ఆంధ్రకు ...

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఆదివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్‌డే వేడుకలను వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులకు యూనివర్సిటీ  విధివిధానాలు, కల్చర్‌ గురించి పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. తమ యూనివర్సిటీలో విద్యార్థులు స్వేచ్ఛగా విద్య నభ్యసించ వచ్చునన్నారు. ఇక్కడ అధ్యాపకులు దగ్గర నుంచి వైస్‌ చాన్స్‌లర్‌ వరకు అందరూ అందుబాటులో ఉంటారని, మీకేమైనా ఇబ్బందులు తలెత్తితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునే దిశగా సాగాలని, వైఫల్యాలను సైతం విజయానికి సోపానంగా మార్చుకోవాలని సూచించారు. సాహసాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. అప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయన్నారు. విజయం అంటే కేవలం వ్యక్తిగతమే కాదు. సమాజంలోని పక్కవారిని ఉద్దరించడమే నిజమైన విజయమన్నారు. జిజ...

విలువలతో కూడిన విజయం ముఖ్యం

విలువలతో కూడిన విజయం ముఖ్యం -   కర్ణాటక – టుంకూర్‌లోని సీవోపీపీఆర్‌ఆర్‌ఓడీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ హెచ్‌జీ చంద్రశేఖర్‌ -  కొత్త ఆవిష్కరణలతో ముందుకు రండి : కర్ణాటకలోని టుంకూర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎం.వెంకటేశ్వర్లు -  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంజినీర్స్‌ డే వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జీవితంలో ప్రతి విద్యార్థి కూడా విలువలతో కూడిన విజయం సాధించడం ముఖ్యమని కర్ణాటక – టుంకూర్‌లోని సీవోపీపీఆర్‌ఆర్‌ఓడీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ హెచ్‌జీ చంద్రశేఖర్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక – టుంకూర్‌లోని సీవోపీపీఆర్‌ఆర్‌ఓడీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ...

వ్యాధుల నుంచి రక్షణపై విజ్ఞాన్‌ విద్యార్థుల అవగాహన

వ్యాధుల నుంచి రక్షణపై విజ్ఞాన్‌ విద్యార్థుల అవగాహన టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు విజయవాడ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు అధిక వర్షం, వరదల వచే కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ ఎలా పొందాలో అవగాహన కల్పించారని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ యూనివర్సిటీకి చెందిన 280 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మూడు గ్రూపులుగా విడిపోయి విజయవాడ నగరంలోని తోట వారి వీధి, నందమూరి నగర్, ఇందిరా కాలనీల్లోని ప్రజలకు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారని తెలియజేసారు. ఇంట్లో, పరిసరాల్లో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవాలన్నారు. వరద సమయం కాబట్టి ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణములు జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ఇంటి లోపల, ఇంటి బయట, రోళ్లు వంటి సామాగ్రిలో నీరు నిలువ లేకుండా చూడాలన్నారు. కాచి చల్లార్చిన పరిశుభ్రమైన నీటిని తాగాలని, ఆహార పదార్థాల పైన మూతలు ఉంచాలని, కూరగాయలు, పండ్లను మంచి నీటితో క...

వరద బాధితులకు భారీ సహాయం అందించిన రోటరీ క్లబ్

వరద బాధితులకు  భారీ సహాయం అందించిన రోటరీ క్లబ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో. రోటరీ 3150 డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి ఆదేశాలతో డిస్ట్రిక్ లోని 23 క్లబ్బులు సహకారంతో సుమారుగా 25 లక్షల రూపాయల ఖరీదు చేసే నిత్యవసర సరుకులు కిట్లు తెనాలికి చేరువులోని కొల్లూరు భట్టిప్రోలు మండలంలోని 10లంక గ్రామాలలో బాధితులు కు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి, పిడుగురాళ్ల క్లబ్ చొరవ తో 23 క్లబ్బులు సహకరించి చేసిన ఈ కార్యక్రమానికి 3150 డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ ఎస్వి రాంప్రసాద్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ తాళ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ విష్ణు ముఖ్య అతిథులుగా, వివిధ క్లబ్బు ల రోటరీ సభ్యులు పాల్గొన్నారు, తెనాలి రోటరీ క్లబ్ నుండి అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణ చంద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ దూళిపాళ్ల రవీంద్రనాథ్ జీవి నారాయణ చేతన్ రాజ్ కొఠారి, పావులూరి రాంబాబు, ఆలపాటి వెంకట్రామయ్య, రాజశేఖర్ రెడ్డి గుమ్మడి ప్రసాద్ ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ఉపేంద్ర, జాస్తి నరేంద్ర, మల్లాది అర్జున్, క...

సినిమా నిర్మాణం కోసం నిధుల సమీకరణ: మార్గాలు అంశంపై సాంకేతిక సదస్సు

సినిమా నిర్మాణం కోసం నిధుల సమీకరణ: మార్గాలు అంశంపై సాంకేతిక సదస్సు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 22, 2024, ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాద్ ఫిలిం బ్రాండింగ్, ఫిలిం సబ్సిడీ, క్రౌడ్ ఫండింగ్, బ్యాంకర్స్ సపోర్ట్, ప్రీ అగ్రిమెంట్ ఫండ్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ సపోర్ట్... ఇలా 20 పద్దతులలో సినిమా నిర్మాణం కోసం పెట్టుబడులను సమకూర్చుకునే మార్గాలపై ప్రముఖ ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ సాంకేతిక సదస్సు ను ఈనెల 22వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనుంది. ప్రముఖ కార్పోరేట్ కంపెనీల ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ అడ్వైజర్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, క్రౌడ్ ఫండింగ్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొని, సినిమా నిర్మాణానికి సాంకేతికంగా నిధులను సమకూర్చుకునే అంశంపై దర్శక నిర్మాతలు, సొంతంగా సినిమాలు ప్రారంభించాలనే ఆసక్తి పరులతో సదస్సులో ముఖాముఖి చర్చాగోష్టిలో పాల్గొని, అతి ముఖ్యమైన సలహాలు, సూచనలను అందిస్తారు. ఈ అత్యంత కీలకమైన సదస్సులో పాల్గొనదలచిన ఆసక్తిగల మరియు ఔత్సాహిక దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తమ పేర్లను ఈ నెల 18 వ తేదీలోగా నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 8...

దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త నాయుడమ్మ

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త నాయుడమ్మ అని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చర్మ పరిశోధన శాస్త్రవేత్త దివంగత యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని నేషనల్ లిగ్నేట్ కార్పొరేషన్ సీఎండీ మోటుపల్లి ప్రసన్నకుమార్ కు మంగళవారం ప్రదానం చేశారు. నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ఏపీ ని గ్రీన్ హైడ్రోజన్ రాష్ట్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని సౌర విద్యుత్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. పురస్కార గ్రహీత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వేసిన పునాది కారణంగా సౌర విద్యుత్ 1.50 లక్షల మెగా వాట్ల ఉత్పత్తికి చేరుకుందని, దానిని 2030 నాటికి 1.50 లక్షల గిగా వాట్ల ఉత్పత్తికి పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. చెన్నై సీఎల్ఆర్ఐ శాస్త్రవేత్త స్వర్ణ వి.కాంత్ మాట్లాడుతూ, దేశంలో చర్మ పరిశోధన సంస్థ సాధిస్తున్న అభివృద్ధి ...

వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న విజ్ఞాన్ విద్యార్థుల సర్వే

వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న విజ్ఞాన్ విద్యార్థుల సర్వే   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు విజయవాడలోని వరద ప్రాంతాల్లో వరుసగా నాలుగవ రోజు వరద సహాయక సర్వే లో పాల్గొన్నారని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ యూనివర్సిటీకి చెందిన 300 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఐదు గ్రూపులుగా విడిపోయి విజయవాడ నగరంలోని వాంబే కాలనీ రోడ్, శాంతి నగర్, డిస్నీ లాండ్ రోడ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రోడ్, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, ఫైర్ స్టేషన్ రోడ్, సుందరయ్య నగర్, తోట వారి వీధి, సింగ్ నగర్, వడ్డెర కాలనీ, పిఎన్టి నగర్ కాలనీలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అనే విషయాలపై సర్వే నిర్వహించి ప్రభుత్వం అందించిన గూగుల్ లింక్ లో అప్డేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సర్వేలో భాగంగా విద్యార్థులు ఆయా కాలనీలో సరైన సమయానికి ఆహారం, పాలు, నీరు అందుతున్నాయా లేదా అనే అంశాల...

విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు

విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి లోని విజ్ఞాన్ యూనివర్సిటీని ఈరోజు జింబాబ్వే నుంచి ప్రభుత్వ ప్రతినిధులు అలాగే న్యూఢిల్లీ నుంచి ఎంబసీ ప్రతినిధులు విచ్చేసారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియాలోని జింబాబ్వే ప్రతినిధి మాట్లాడుతూ క్రిత సంవత్సరం 45 మంది విద్యార్థులను జింబాబ్వే ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీలో వేర్వేరు ఇంజనీరింగ్ కోర్సెస్ లో చదవడానికి పంపించామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 107 మంది విద్యార్థులను వేర్వేరు కోర్సుల కోసం ఇక్కడికి పంపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ కోర్సెస్ లో అగ్రికల్చర్ బీఎస్సీ కి ప్రాముఖ్యతనిస్తూ జింబాబ్వే ప్రభుత్వం ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఈ కోర్సుకి ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులను పంపించడానికి గల కారణాలు వివరిస్తూ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతోపాటు మంచి నైపుణ్యాలు అలాగే కమ్యూనికేషన్స్ స్కిల్స్ మరియు మానవతా విలువలు నేర్పడం జరుగుతుం...

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ప్రభావిత కాలనీల్లో ఆహారం, బ్రెడ్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని 250 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి విజయవాడ సిటీ లోని చిన్ని నగర్, అజిత్ సింగ్ నగర్, వడ్డెర కాలనీ, పీన్టీ నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, తోట వారి వీధి, సింగ్ నగర్ కాలనీలోని ప్రజలకు బ్రెడ్ ప్యాకెట్స్, రైస్ ప్యాకెట్స్, గుడ్లు, నిత్యవసర సరుకులు అందజేశారు. మరి కొంతమంది విద్యార్థులు తాడేపల్లి లోని పలు కాలనీలలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాల సర్వే లో పాల్గొన్నారు. కష్ట సమయంలో వరద బాధితులకు ప్రజలందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్...

యండమూరి "అంతర్ముఖం" వెండి తెరపై ఆవిష్కరిస్తున్న తుమ్మలపల్లి

యండమూరి "అంతర్ముఖం" వెండి తెరపై ఆవిష్కరిస్తున్న తుమ్మలపల్లి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత - దర్శకులు  యండమూరి వీరేంద్రనాధ్'తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే "అంతర్ముఖం"ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సీనియర్ ఛాయాగ్రాహకులు మీర్ కెమెరామెన్. "యు అండ్ ఐ", మహేష్, యు.ఎస్, "వర్చ్యువల్ ఒన్" సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోపాటు ప్రముఖ దర్శకుడు నంది అవార్డు గ్రహీత అల్లాణి శ్రీధర్, జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలోనూ చిత్రాలు నిర్మించేందుకు తుమ్మలపల్లి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ.

వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు

వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారాకి చెందిన 300 కి పైగా విద్యార్థులు విజయవాడ నగరంలోని 18 వార్డ్స్ లో అందుతున్న సహాయక చర్యల సర్వేలో పాల్గొన్నారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయక కార్యక్రమాలు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు సరిగా అందాయా లేదా అనే సర్వేలో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు ముమ్మరంగా పర్యటించి వారికి సరైన సమయంలో ఆహారం అందుతుందా లేదా?  ప్రభుత్వం అందించిన రేషన్ వారికి చేరిందా లేదా ? వారికి అందుతున్న సహాయక చర్యలు బాగున్నాయా లేదా? వారు నివసిస్తున్న ప్రాంతాల్లో శానిటేషన్ జరిగిందా లేదా? వారి ఇళ్...

ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరదబాదితులకు నిత్యావసరాల పంపిణీ

ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరదబాదితులకు నిత్యావసరాల పంపిణీ . టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు కనపర్తి రత్నాకర్ సూచన మేరకు ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు పుట్ట పున్నయ్య పర్యవేక్షణలో కొల్లిపర మండలం లోని వరద ముంపుకు గురైన పాత బొమ్మువారి పాలెంలో శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బాధితులకు తమ వంతుగా ఫెడరేషన్ లోని జర్నలిస్టులు బాధితులకు వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, ఆకుకూరలు పంపిణీ చేసారు.  గ్రామం లోని రెండు వందల కుటుంబాలకు సాయం అందించారు. ఫెడరేషన్ కార్యదర్శి ఎస్. ఎస్. జహీర్, ఎం. శ్రీకాంత్, శేఖర్ ఎస్.ఎస్.వి, గుమ్మడి ప్రకాశరావు, కరేటీ సాంబశివరావు, చింతా మణికుమార్, వాలంటీర్లు చిక్కాల రజినీ, కంభం విజయ దుర్గ, రానావత్ దుర్గా ప్రసాద్, నాగ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు అచ్యుత  సాంబశివరావు, డి. కోటేశ్వరరావు, నరేష్ జైన్ , షణ్ముఖేశ్వర రావు కార్యక్రమానికి సహకరించారు.