విలువలతో కూడిన విజయం ముఖ్యం
- కర్ణాటక – టుంకూర్లోని సీవోపీపీఆర్ఆర్ఓడీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ హెచ్జీ చంద్రశేఖర్
- కొత్త ఆవిష్కరణలతో ముందుకు రండి : కర్ణాటకలోని టుంకూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
జీవితంలో ప్రతి విద్యార్థి కూడా విలువలతో కూడిన విజయం సాధించడం ముఖ్యమని కర్ణాటక – టుంకూర్లోని సీవోపీపీఆర్ఆర్ఓడీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ హెచ్జీ చంద్రశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక – టుంకూర్లోని సీవోపీపీఆర్ఆర్ఓడీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ హెచ్జీ చంద్రశేఖర్ మాట్లాడుతూ మన దేశ భవిష్యత్, అభివృద్ధి మొత్తం యువత మీదే ఆధారపడి ఉందన్నారు. యువత తమ ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణలకు పూనుకోవాలన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదవకుండా ఇష్టంతో ప్రయోగాలు చేయడం వలన సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజినీరింగ్ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చన్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటో మొబైల్.... ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు.
కొత్త ఆవిష్కరణలతో ముందుకు రండి : కర్ణాటకలోని టుంకూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు
విద్యార్థులందరూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కర్ణాటకలోని టుంకూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి వారికొచ్చే ఆలోచనలలో ఒక్కటైనా ఆచరణలోనికి తీసుకురాగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. విద్యార్థులందరూ వారి ఆలోచననలను స్టార్టప్స్గానో, కంపెనీలతో అసోసియేట్ అవ్వడమో చేసి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికీ ఉంటుందన్నారు. భారతీయ ఇంజినీరింగ్ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటే ప్రపంచ దేశాలను శాసించే సదావకాశం మన ముంగిట ఉంటుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ ముందుగా సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించాలన్నారు. ఆ తర్వాత సమస్యను ఏ విధంగా పరిష్కరించగలమో ఆలోచించాలన్నారు. విద్యార్థులందరూ నిర్వహణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్, టెక్నాలజీలను అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రపంచం ఇంత వేగంగా ముందుకెళ్తుందంటే దానికి కారణం ఇంజినీర్లేనని పేర్కొన్నారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాగా రోజుకు 16 గంటలు కష్టపడాలన్నారు. ప్రస్తుతం దేశానికి మిలియన్ల మంది ఇంజినీర్ల అవసరం ఉందన్నారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను వినియోగించాలన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఇంజినీరింగ్ విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని సరికొత్త టెక్నాలజీలను ఆవిష్కరించాలన్నారు. అప్పుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్న కలలు, ఆశయాలు సాకారమవుతాయన్నారు. విద్యార్థులు నిరంతరం కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండాలన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ మాట్లాడుతూ ఇరిగేషన్ బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్థమైన నీటిని నిల్వచేసి తిరిగి ఉపయోగించే విధంగా విశ్వేశ్వరయ్య కృషి చేసారని కొనియాడారు. విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజినీరుగా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాముల నిర్మాతగా, స్టేట్స్మన్గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దేశాభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లను కనుగొన్నది ఆయనేనని, ఆ గేట్లు ఇరిగేషన్ వ్యవస్థలో పెను విప్లవంగా నిలిచాయన్నారు. ఇప్పటికీ ఇదే పరిజ్ఞానాన్ని జలాశయాల నిర్మాణంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన ఆలోచనలతో దేశానికి ఎంతో సేవ చేశారని, నీటి పారుదల వ్యవస్థలో దేశానికి తిరుగులేని పరిజ్ఞానాన్ని అందించారని పేర్కొన్నారు. ఈయన జన్మదినాన్ని మనదేశంతో పాటు శ్రీలంక, టాంజానియా దేశాలు కూడా ఈరోజును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారని తెలియజేసారు. ఇంజనీర్స్డేను పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పోలు అతిథులను ఆకట్టుకుంది. అత్యుత్తమంగా రూపొందించిన ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. పరిశోధన పత్రాలు సమర్పించిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.