ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ ఏర్పాటు

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ ఏర్పాటు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కన్వీయింగ్ కమిటీ నూతనం గా ఏర్పాటయింది. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో  గురువారం సాయంత్రం జరిగిన సమావేశం లో కమిటీని ఎంపికచేశారు. సమావేశానికి ఫెడరేషన్ నాయకులు ఎస్.ఎస్. జహీర్ అధ్యక్షతన వహించారు. జిల్లా కన్వీనర్ గా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ఈస్ట్ కో కన్వీనర్లు గా పి. సాయి కుమార్, వరదల మహేష్  గుంటూరు వెస్ట్ కో కన్వీనర్లు గా అజయ్ ఇండియన్, వేముల రాజేష్, తెనాలి కో కన్వీనర్ గా ఎమ్. శ్రీకాంత్, పొన్నూరు కో కన్వీనర్లు గా అత్తోట సంజయ్, కె.కృష్ణ, మంగళగిరి కో కన్వీనర్ గా చింతా మణి కుమార్, తాడికొండ కో కన్వీనర్లు గా ఎన్. జె.శామ్యూల్, సయ్యద్ కరిముల్లా, పత్తిపాడు కె. పుల్లారావు లు ఎంపికయ్యారు. త్వరలో ఫెడరేషన్ జిల్లా మహాసభ జరగనుందని నూతనం గా కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన రత్నాకర్ తెలిపారు. సమావేశం లో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.