రేపు డాక్టర్ కత్తి పద్మారావుకు మన కాలపు జాషువా పురస్కార ప్రదానం

రేపు డాక్టర్ కత్తి పద్మారావుకు  మన కాలపు జాషువా పురస్కారం  ప్రదానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారా వుకు ఖమ్మానికి చెందిన జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'మన కాలపు జాషువా' పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ శుక్రవారం సాయంత్రం తెనాలిలోని సేవా ట్రస్ట్ కార్యాలయంలో విలేక రుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన పొన్నూరులోని లుంబినీవనం లో కార్యక్రమం ఉంటుందన్నారు. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్ర మంలో అంబేడ్కర్ వాదులు, దళిత మహాసభ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సం ఖ్యలో పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావే శంలో అంబేడ్కర్ సేవా ట్రస్ట్ కార్యదర్శి దోబా సం దీప్, ట్రెజరర్ పాముల దాసు, కనపర్తి ఎజ్రా, కొండ్రు రవీంద్ర, కనపర్తి చిట్టిబాబు, బ్రూస్లీ తదితరులు పాల్గొన్నారు.