Skip to main content

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి
 - గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ (ఐఏఎస్‌)
-  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులందరూ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని యూఈఏసీ (యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌ యాక్టివిటీ కౌన్సిల్‌) విద్యార్థుల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా సమాజానికి వీలైనంత సేవ చేయాలని, పది మందికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. అంతేకాకుండా యూనివర్సిటీ పరిధిలోని 5 గ్రామాలను ( శలపాడు, వడ్లమూడి, వీరనాయకునిపాలెం, వేజండ్ల, సుద్దపల్లి) దత్తత తీసుకుని సంవత్సర కాలంలో 107 సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనడం వలన సమాజానికి ప్రయోజనం కలగడంతో పాటు విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తిపరమైన అవకాశాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు విద్య, ఆరోగ్యం, పరిసర ప్రాంతాలు, కాలుష్యం, సమస్యలను పరిష్కరించడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను, నాలెడ్జ్, స్కిల్స్, ఇంటెలిజెన్స్, సమయ స్ఫూర్తిను తోటి విద్యార్థుల్లో నింపాలన్నారు. ప్రజలకు ఇంకా ఉపయోగపడే పనులు ఏం చేయచ్చో గుర్తించి వారిని కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు సంవత్సర కాలంలో నిర్వహించిన 107 కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ డేను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌)ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్సలర్‌ కల్నల్‌ ప్రొఫెసర్‌ పి నాగభూషణ్, రిజిస్టార్‌ డాక్టర్‌ ఎమ్మెస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...