చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమే

చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమే
- ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రావూరి అంజలి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి రూరల్, సెప్టెంబర్ 25:చినుకుపడితే నిరాశ్రయుల జీవితాలు ఛిద్రమౌతున్నాయని ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్  రావూరి అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. గతరెండు వారలుగా ఎడతెరుపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తిండిలేక,ఉండటానికి వసతిలేక సాయంకోసం  ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు .ఈసందర్భంగా రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని కాలువకట్టలపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున బాధితులకు  బుధవారం  ఆమె  నిత్యావసరాలను పంపిణిచేశారు.అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో  భారీ వర్షాల కారణంగా తలదాచుకున్న సంచార కుటుంబాలకు దుప్పట్లు, నిద్రించడానికి చాపలను అందజేసినట్లుగా అంజలి తెలిపారు.పంపిణి కార్యక్రమoలో సంస్ధ  డైరెక్టర్ రావూరి సురేష్ బాబు, వాలంటరీలు 
ఇంటూరి విజయభాస్కర్, బందెల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు

ఫోటో  రైటప్ 

నిత్యావసరాలను పంపిణి చేస్తున్న  రావూరి అంజలి