Skip to main content

విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు

విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి లోని విజ్ఞాన్ యూనివర్సిటీని ఈరోజు జింబాబ్వే నుంచి ప్రభుత్వ ప్రతినిధులు అలాగే న్యూఢిల్లీ నుంచి ఎంబసీ ప్రతినిధులు విచ్చేసారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియాలోని జింబాబ్వే ప్రతినిధి మాట్లాడుతూ క్రిత సంవత్సరం 45 మంది విద్యార్థులను జింబాబ్వే ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీలో వేర్వేరు ఇంజనీరింగ్ కోర్సెస్ లో చదవడానికి పంపించామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 107 మంది విద్యార్థులను వేర్వేరు కోర్సుల కోసం ఇక్కడికి పంపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ కోర్సెస్ లో అగ్రికల్చర్ బీఎస్సీ కి ప్రాముఖ్యతనిస్తూ జింబాబ్వే ప్రభుత్వం ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఈ కోర్సుకి ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులను పంపించడానికి గల కారణాలు వివరిస్తూ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతోపాటు మంచి నైపుణ్యాలు అలాగే కమ్యూనికేషన్స్ స్కిల్స్ మరియు మానవతా విలువలు నేర్పడం జరుగుతుందని  వివరించారు. ఈ కారణాలతో ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులను పంపించడానికి మార్గం సుగమం అయిందని సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ జింబాబ్వేలో ఎక్కువగా వరి పంట పండించడానికి కావలసినటువంటి నైపుణ్యాలను విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి జింబాబ్వే విద్యార్థిని విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందన్నారు. తద్వారా ఈ విద్యార్థిని విద్యార్థులు జింబాబ్వేకి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ కమర్షియల్ క్రాప్ గా వరి పంటను అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి మెలకువలను నేర్పించడం జరుగుతుందని వివరించారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రెండు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి విద్యార్థులు కీలకంగా వ్యవహరిస్తారని తద్వారా జింబాబ్వే కూడా త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా విజ్ఞాన్ లో చదివినటువంటి విద్యార్థులు కృషి చేస్తారని తెలియజేశారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం మాట్లాడుతూ జింబాబ్వే విద్యార్థిని విద్యార్థులు ఆ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని అందజేసి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యను ఎక్కువమంది పిల్లలకు నాలెడ్జ్ షేరింగ్ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎక్కువ తెలివితేటలున్నటువంటి విద్యార్థులని నాలెడ్జ్ క్రియేటర్స్ గా ప్రమోట్ చేయాలని దానికి కావలసినటువంటి వసతులు కల్పించాలని జింబాబ్వే ప్రతినిధులకు సూచించారు. 
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ. నాగభూషన్, రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, సీఈవో నందిగామ శ్రీకాంత్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...