ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరదబాదితులకు నిత్యావసరాల పంపిణీ

ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరదబాదితులకు నిత్యావసరాల పంపిణీ.
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు కనపర్తి రత్నాకర్ సూచన మేరకు ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు పుట్ట పున్నయ్య పర్యవేక్షణలో కొల్లిపర మండలం లోని వరద ముంపుకు గురైన పాత బొమ్మువారి పాలెంలో శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బాధితులకు తమ వంతుగా ఫెడరేషన్ లోని జర్నలిస్టులు బాధితులకు వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, ఆకుకూరలు పంపిణీ చేసారు.  గ్రామం లోని రెండు వందల కుటుంబాలకు సాయం అందించారు. ఫెడరేషన్ కార్యదర్శి ఎస్. ఎస్. జహీర్, ఎం. శ్రీకాంత్, శేఖర్ ఎస్.ఎస్.వి, గుమ్మడి ప్రకాశరావు, కరేటీ సాంబశివరావు, చింతా మణికుమార్, వాలంటీర్లు చిక్కాల రజినీ, కంభం విజయ దుర్గ, రానావత్ దుర్గా ప్రసాద్, నాగ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు అచ్యుత  సాంబశివరావు, డి. కోటేశ్వరరావు, నరేష్ జైన్ , షణ్ముఖేశ్వర రావు కార్యక్రమానికి సహకరించారు.