Skip to main content

వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు

వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారాకి చెందిన 300 కి పైగా విద్యార్థులు విజయవాడ నగరంలోని 18 వార్డ్స్ లో అందుతున్న సహాయక చర్యల సర్వేలో పాల్గొన్నారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయక కార్యక్రమాలు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు సరిగా అందాయా లేదా అనే సర్వేలో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు ముమ్మరంగా పర్యటించి వారికి సరైన సమయంలో ఆహారం అందుతుందా లేదా?  ప్రభుత్వం అందించిన రేషన్ వారికి చేరిందా లేదా ? వారికి అందుతున్న సహాయక చర్యలు బాగున్నాయా లేదా? వారు నివసిస్తున్న ప్రాంతాల్లో శానిటేషన్ జరిగిందా లేదా? వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా జరుగుతుందా లేదా? ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రభుత్వ అధికారుల పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి డేటా సేకరించి ప్రభుత్వం అందించిన గూగుల్ లింక్ లో తమ విద్యార్థులు అప్డేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారా లేక దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? వరదల వల్ల సంబంధిత కుటుంబం ఎంత నష్టపోయారు అనే విషయాన్ని కూడా సేకరించి సంబంధిత లింక్ లో పొందుపరుస్తున్నారని వెల్లడించారు. ఏదైనా ప్రాంతాల్లో సహాయచర్యలు సరిగా జరగకపోయినా వెంటనే తమ విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వరద సహాయక చర్యల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టార్ డాక్టర్ ఎమ్మెస్ రఘునాథన్, విజ్ఞాన్ లారా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...