Skip to main content

అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి


అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి
 - శతజయంతి వేడుకల్లో 'మా-ఎపి'తీర్మానo.
- భారతప్రభుత్వానికీ 'మా-  ఎపి' వినతి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, సెప్టెంబర్ 20 : అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సoదర్భంగా అయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా 'మా- ఎపి'  తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్ట్యున్  కల్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శతజయంతి వేడుకలు జరగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా అయన తెలిపారు.నటిoచిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వ విద్యాలయంగా ఆయన అభివర్ణించారు.తాగుబోతులను,ప్రేమలో  ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికీ సంభోధిస్తున్నారంటే ఆపాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోను,మహాసముద్రమంత వైశాల్యంలో ఉండటo జగమెరిగిన సత్యమని ఆయన
పేర్కొన్నారు.దేవదాసు,ప్రేమాభిషేకం,మాయాబజార్,మేఘసందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అన్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలనే  ఎoపిక చేసుకొని ఆయా పాత్రలకు నూరుశాతం న్యాయం చేసినందువలనే పద్మశ్రీ,పద్మవిభూషణ్,దాదాసాహెబ్ ఫాల్కే,పద్మభూషణ్ అవార్డులు అక్కినేనిని వరించాయని చెప్పారు.కార్యక్రమములో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగా సుభాష్ చంద్రబోస్, మిలటరీ ప్రసాద్,రావూరి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముది జయకర్,శ్రీకాంత్, డాక్టర్ భూషణం,రమణయ్య,బసవయ్య తదితరులు పాల్గోన్నారు.ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...