Skip to main content

Posts

Showing posts from October, 2024

ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా

ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా      - దర్శకుడు దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, అక్టోబర్ 30: జమైక దేశంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ చందోలు నాగమల్లేశ్వర రావు నిర్మిస్తున్న జగజ్జీవన్ రామ్ బయోపిక్ లో ఆరుగురు శాసన సభ్యులు నటిస్తున్నట్లుగా ఆచిత్ర దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.గుంటూరుజిల్లా తెనాలిలోని 'మా - ఏపీ' కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబరు 9 నుంచి తెనాలిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందన్నారు.స్వాతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ రెండు పర్యాయాలు బ్రిటిష్ చెరసాలకు వెళ్లిన నేపధ్యంలో స్వాతంత్రోద్యమoలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .ఇందులో భాగంగానే భగత్ సింగ్ పాత్రలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,చంద్రశేఖర్ ఆజాద్ గా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర,బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్,ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా,దస్తగిరి,జయసూర్యలు వివిధ పాత్రలు పోషిస్తున్...

సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం

* సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం * *అల్ ఇండియా పంచాయత్ పరిషత్ దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా విజయ్ వర్మ  పాకలపాటి* *జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అపెక్స్ బాడీగా మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తున్న అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ గ్రామీణ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలలో నేడు నెలకొని వున్న స్థితిగతులను అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయనుంది. ఈ కమిటీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన వీస్. విజయ్ వర్మ పాకలపాటి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఏ ఐ పి పి మెంబెర్ గా వున్న ఈయన్ని దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా నియమిస్తూ దక్షిణాది రాష్ట్రాలలో పంచాయత్ పరిషత్ బలోపేతంతో పాటు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని మారుమూల గ్రామాలలో నెలకొన్న నేటి స్థితిగతులను సమగ్రంగా అధ్...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొమ్మోజు లోవరాజు అనే అధ్యాపకుడికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ యాన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ బేస్డ్‌ క్లౌడ్‌ ఎనేబుల్డ్‌ సర్వీస్‌ ఫర్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌ మోనిటరింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ సిస్టమ్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, అసోసియట్‌ డీన్‌–ఏఏఏ డాక్టర్‌ వి. విజయరాఘవన్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన కొమ్మోజు లోవరాజును వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొమ్మోజు లోవరాజు అనే అధ్యాపకుడికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ యాన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ బేస్డ్‌ క్లౌడ్‌ ఎనేబుల్డ్‌ సర్వీస్‌ ఫర్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌ మోనిటరింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ సిస్టమ్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, అసోసియట్‌ డీన్‌–ఏఏఏ డాక్టర్‌ వి. విజయరాఘవన్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన కొమ్మోజు లోవరాజును వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.