సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం
*సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం*
*అల్ ఇండియా పంచాయత్ పరిషత్ దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా విజయ్ వర్మ పాకలపాటి*
*జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు*
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అపెక్స్ బాడీగా మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తున్న అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ గ్రామీణ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలలో నేడు నెలకొని వున్న స్థితిగతులను అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయనుంది. ఈ కమిటీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన వీస్. విజయ్ వర్మ పాకలపాటి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఏ ఐ పి పి మెంబెర్ గా వున్న ఈయన్ని దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా నియమిస్తూ దక్షిణాది రాష్ట్రాలలో పంచాయత్ పరిషత్ బలోపేతంతో పాటు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని మారుమూల గ్రామాలలో నెలకొన్న నేటి స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించిన సంస్థ అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి సుభోద్ కాంత్ సహా మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలపై ఎంతో మమేకం వున్న విజయ్ వర్మ ఆయా రాష్ట్రాల అధ్యక్షులు కన్వీనర్లతో సమన్వయం చేసుకొని అధ్యయన అనంతరం ఈ నివేదికను అందచేస్తారని పేర్కొన్నారు.ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని , తద్వారా క్రింది స్థాయిలో నెలకొని వున్న నిధుల లభ్యత
, మౌలిక వసతులు, సామాజిక సాంఘీక నేపధ్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయడం , జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దేలా సిఫార్సు చెయ్యడం జరుగుతుందని అన్నారు.ఢిల్లీ మయూరి విహార్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన విజయ్ వర్మ మాట్లాడుతూ 1992 లో చట్టంగా వచ్చిన పంచాయతీరాజ్ 73,74 వ ఎమెండ్ మెంట్ నేటికీ సంపూర్ణంగా అమలుకాకపోవడం శోచనీయమని ఈ అధ్యయనం ద్వారా వాస్తవ గ్రామీణ స్థితిగతులను లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ ఆశయాలతో బల్వంత్ రాయ్ మెహతా, భారత రత్న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ గుల్జారీ లాల్ నందా లు ప్రారంభించిన ఈ సంస్థలో స్థానిక సంస్థల సభ్యులు అందరూ చేరి గ్రామీణ భారత వికాసానికై ప్రభుత్వాలకు సూచనలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు సుబోధ్ కాంత్ సహాయ్,వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ చౌహాన్, జనరల్ సెక్రటరీ అనిల్ శర్మ , సెక్రటరీ ధ్యాన్ పాల్ సింగ్ మరియు 28 రాష్ట్రాల 8 కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు , కన్వీనర్లు , తెలుగు రాష్ట్రాలనుండి సీనియర్ నాయకులు జన్ను రామచంద్రయ్య , ఎమ్ ఏ జలీల్ , పద్మనాభరెడ్డి , ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు .