Skip to main content

సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం

*సినీ నిర్మాత విజయ్ వర్మ కు జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ మరియు దక్షిణాది రాష్ట్రాల అఖిల భారత పంచాయత్ పరిషత్ సమన్వయకర్తగా సముచిత స్థానం*
*అల్ ఇండియా పంచాయత్ పరిషత్ దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా విజయ్ వర్మ  పాకలపాటి*
*జాతీయ గ్రామీణ స్థితిగతుల అద్యయన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు*
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అపెక్స్ బాడీగా మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తున్న అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ గ్రామీణ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలలో నేడు నెలకొని వున్న స్థితిగతులను అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయనుంది. ఈ కమిటీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన వీస్. విజయ్ వర్మ పాకలపాటి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఏ ఐ పి పి మెంబెర్ గా వున్న ఈయన్ని దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా నియమిస్తూ దక్షిణాది రాష్ట్రాలలో పంచాయత్ పరిషత్ బలోపేతంతో పాటు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని మారుమూల గ్రామాలలో నెలకొన్న నేటి స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించిన సంస్థ అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి సుభోద్ కాంత్ సహా మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలపై ఎంతో మమేకం వున్న విజయ్  వర్మ ఆయా రాష్ట్రాల అధ్యక్షులు కన్వీనర్లతో సమన్వయం చేసుకొని అధ్యయన అనంతరం ఈ నివేదికను అందచేస్తారని పేర్కొన్నారు.ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని , తద్వారా క్రింది స్థాయిలో నెలకొని వున్న నిధుల లభ్యత 
, మౌలిక వసతులు, సామాజిక సాంఘీక నేపధ్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయడం , జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దేలా సిఫార్సు చెయ్యడం జరుగుతుందని అన్నారు.ఢిల్లీ మయూరి విహార్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన విజయ్ వర్మ మాట్లాడుతూ 1992 లో చట్టంగా వచ్చిన పంచాయతీరాజ్  73,74 వ ఎమెండ్ మెంట్ నేటికీ సంపూర్ణంగా అమలుకాకపోవడం శోచనీయమని ఈ అధ్యయనం ద్వారా వాస్తవ గ్రామీణ స్థితిగతులను లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ ఆశయాలతో బల్వంత్ రాయ్ మెహతా, భారత రత్న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్  గుల్జారీ లాల్ నందా లు ప్రారంభించిన ఈ సంస్థలో స్థానిక సంస్థల సభ్యులు అందరూ చేరి గ్రామీణ భారత వికాసానికై ప్రభుత్వాలకు సూచనలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు సుబోధ్ కాంత్ సహాయ్,వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ చౌహాన్, జనరల్ సెక్రటరీ అనిల్ శర్మ , సెక్రటరీ ధ్యాన్ పాల్ సింగ్ మరియు 28 రాష్ట్రాల 8 కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు , కన్వీనర్లు , తెలుగు రాష్ట్రాలనుండి సీనియర్ నాయకులు జన్ను రామచంద్రయ్య , ఎమ్ ఏ జలీల్ , పద్మనాభరెడ్డి , ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు .

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...