Skip to main content

ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా

ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా   
 - దర్శకుడు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, అక్టోబర్ 30: జమైక దేశంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ చందోలు నాగమల్లేశ్వర రావు నిర్మిస్తున్న జగజ్జీవన్ రామ్ బయోపిక్ లో ఆరుగురు శాసన సభ్యులు నటిస్తున్నట్లుగా ఆచిత్ర దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.గుంటూరుజిల్లా తెనాలిలోని 'మా - ఏపీ' కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబరు 9 నుంచి తెనాలిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందన్నారు.స్వాతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ రెండు పర్యాయాలు బ్రిటిష్ చెరసాలకు వెళ్లిన నేపధ్యంలో స్వాతంత్రోద్యమoలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .ఇందులో భాగంగానే భగత్ సింగ్ పాత్రలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,చంద్రశేఖర్ ఆజాద్ గా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర,బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్,ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా,దస్తగిరి,జయసూర్యలు వివిధ పాత్రలు పోషిస్తున్నారని దర్శకుడు దిలీప్ రాజా తెలిపా రు.వంద సంవత్సరాల  క్రితం జరిగిన యదార్ధ సంఘటనలను చిత్రీకరించడానికి నిర్మాణ సమయం,వ్యయం ఎక్కువ అయిందని ఆయన వివరించారు.టైటిల్ పాత్రలో మిలటరీ ప్రసాద్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పాత్రలో సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి, కన్నడ నటుడు మర్కాలి, జీవ, నరసింహ రాజు, అన్నపూర్ణ, కావ్య కీర్తి,దివిజ, పద్మిని, రజియ,ఎర్రబాబు,భాను, హరిబాబు తదితరులు నటవర్గమని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.కాగా ఇప్పటికే జగజ్జీవన్ రామ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి   నాదెండ్ల మనోహర్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్,ఎమ్మార్పీస్ నేత మందా కృష్ణ ,రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు,బీజేపీ నేత యడ్లపాటి రఘునాథ్ బాబు,ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు,మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు పబ్లిసిటీ పోస్ట‌ర్‌ను ప‌రిశీలించారని ద‌ర్శ‌కుడు దిలీప్ రాజా చెప్పారు.పెదరావురు ఫిలిం స్టూడియో పతాకంపై చందోలు దేవదాసు సమర్పణలో ఎన్నారై డాక్టర్ నాగ మల్లేశ్వర రావు నిర్మాతగా తెనాలిలో రూపొందుతున్న జగజ్జీవన్ రామ్ సినిమాకు  కో-ఆర్డినేటర్ కాలేబ్ రాజు కాగా కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం దిలీప్ రాజా .పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం 2025 లో సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని యూనిట్ కంట్రోలర్ ప్రదీప్ దోనేపూడి తేలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...