7న విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ విద్యార్థుల 2వ స్నాతకోత్సవం
_ ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్
_ 858 మంది విద్యార్థులకు డిగ్రీలు
ఆన్లైన్ ఎడ్యుకేషన్ విద్యార్థుల 2వ కాన్వకేషన్కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్న విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్;
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆన్లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు కలిసి స్నాతకోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న జరిగే 2వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. 2వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 858 (ఎంబీఏ–668, ఎంసీఏ–190) మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. 7న జరిగే 2వ స్నాతకోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్, చాన్స్లర్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అకడమిక్ కౌన్సిల్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.