Skip to main content

పాలిమర్‌ల సాయంతో పర్యావరణ కాలుష్యం తగ్గించవచ్చు

పాలిమర్‌ల సాయంతో పర్యావరణ కాలుష్యం తగ్గించవచ్చు
- పూణెలోని సోమయ్య విద్యావిహార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సీ.వీ.అవధాని
- విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జీవశక్తితో సులభంగా కరిగే పాలిమర్‌లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని పూణెలోని సోమయ్య విద్యావిహార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సీ.వీ.అవధాని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సెర్బ్‌ ఇండియా ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఫ్రాంటియర్స్‌ ఇన్‌ పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌సీఎఫ్‌పీఎస్‌టీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను గురువారం వైభవంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ బ్రౌచర్‌ను ముఖ్య అతిథులు ఘనంగా ఆవిష్కరించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూణెలోని సోమయ్య విద్యావిహార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సీ.వీ.అవధాని మాట్లాడుతూ పాలిమర్‌ సైన్స్‌ మరియు టెక్నాలజీ రంగం ఎన్నో విధాలుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. మెడికల్‌ ఫీల్డ్‌లో ఉపయోగించే పాలిమర్స్‌ మన్నికైన ఔషధ డెలివరీ వ్యవస్థల అభివృద్ధికి, మెరుగైన సర్జికల్‌ పరికరాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. అధునాతన పాలిమర్‌లు సౌర ప్యానెల్స్, బ్యాటరీలు, సెన్సార్ల తయారీలో కూడా ఉపయోగపడతాయన్నారు. తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన పరికరాలను అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కేరళలోని సెయింట్‌ బెర్చ్‌మన్స్‌ కాలేజ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెంజిత్‌ థామస్‌ మాట్లాడుతూ పాలిమర్‌లు ప్లాస్టిక్, రబ్బర్, ఫైబర్స్, ప్యాకేజింగ్, మెడికల్‌ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వినియోగిస్తారని విద్యార్థులకు తెలియజేసారు. ప్లాస్టిక్‌ కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా బయోపాలిమర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. స్మార్ట్‌ పాలిమర్స్‌ ఉష్ణోగ్రత, పీహెచ్, వెలుతురు వంటి పరిస్థితుల మార్పులకు అనుగుణంగా స్పందిస్తాయన్నారు. ఈ స్మార్ట్‌ పాలిమర్‌లను మెడికల్‌ రంగంలో, ముఖ్యంగా డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన భువనేశ్వర్‌లోని ఐఐటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కే. విజయక్రిష్ణ మాట్లాడుతూ నానోపాలిమర్‌లు చిన్న పరమాణు స్థాయిలో రూపొందించి అధిక నాణ్యత కలిగిన వస్తువులను సృష్టించేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. మెడికల్‌ డయాగ్నోస్టిక్స్, కేన్సర్‌ చికిత్స, ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీలలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌ చేసిన పాలిమర్‌ల ద్వారా పర్యావరణ రక్షణకు తోడ్పడవచ్చు. పాలిమర్‌ సైన్స్‌ ఆధారంగా కొత్త ప్రొడక్ట్‌ల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు పురోగతిని తీసుకువస్తుందన్నారు. ప్యాకేజింగ్, మిలటరీ, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థ రక్షణ వంటి రంగాలలో ఈ సాంకేతికత విస్తృతంగా ఉపయోగపడుతోందని వెల్లడించారు. పాలిమర్‌ సైన్స్‌లోని ఆధునిక పరిశోధనలు మన సమాజానికి శాశ్వతమైన మార్పులను అందించగలవని, అవి పరిశ్రమలతో పాటు పర్యావరణానికి కూడా ఒక సరైన దిశ చూపుతాయని అభిప్రాయపడ్డారు. అనంతరం ముఖ్య అతిథులును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ఐఐసీటీ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌ కుమార్, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...