Skip to main content

జనవరి 30న విజ్ఞాన్‌ ఫార్మసీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

జనవరి 30న విజ్ఞాన్‌ ఫార్మసీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో జనవరి 30 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాస బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాస బాబు మాట్లాడుతూ  ‘‘ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పర్సనలైజ్డ్‌ డ్రగ్‌ డిస్కవరీస్‌– ఏ ఫ్యూచరిస్టిక్‌ అప్రోచ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ‘‘ నెక్ట్స్‌జెన్‌ ఫార్మా కనెక్ట్‌–2025’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంటుకుమార్‌ ఎం.పటేల్, గౌరవ అతిథులుగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ మెంబర్, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎస్‌.ఎల్‌.ఎన్‌ ప్రసాద్‌ రెడ్డి, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎం.వెంకట రమణ, ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.విల్లియం కారే హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లోని బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ జగదీష్‌ బాబు రంగిశెట్టి, గౌరవ అతిథులుగా హెదరాబాద్‌లోని బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కో–ఫౌండర్‌ డాక్టర్‌ మానిక్‌ రెడ్డి పుల్లగుర్ల, హైదరాబాద్‌లోని జెనరా ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆరుట్ల హాజరవుతారని వెల్లడించారు. ఈ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ డ్రగ్‌ డిస్కవరీ అండ్‌ డెవలప్‌మెంట్, ఫార్మాకో జీనోమిక్స్‌ అండ్‌ ప్రెసిషన్‌ థెరపాటిక్స్, నానోటెక్నాలజీ అండ్‌ టార్గెటెడ్‌ డ్రగ్‌ డెలివరీ సిస్టమ్స్, కంప్యుటేషనల్‌ టూల్స్‌ అండ్‌ ఏఐ ఇన్‌ పర్సనలైజ్డ్‌ డ్రగ్‌ డిజైన్, ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ క్లినికల్‌ ట్రయల్‌ డిజైన్స్‌ ఫర్‌ ప్రెసిషన్‌ థెరపాటిక్స్, రోల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇన్‌ టార్గెటెడ్‌ థెరపీ అనే అంశాలపై కూలంకషంగా చర్చిస్తారని పేర్కొన్నారు. బ్రౌచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాస బాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, కన్వీనర్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...