జనవరి 30న విజ్ఞాన్ ఫార్మసీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో జనవరి 30 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాస బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు సంబంధించిన బ్రౌచర్ను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాస బాబు మాట్లాడుతూ ‘‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్– ఏ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ‘‘ నెక్ట్స్జెన్ ఫార్మా కనెక్ట్–2025’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్, గౌరవ అతిథులుగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్ రెడ్డి, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.వెంకట రమణ, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విల్లియం కారే హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈవో డాక్టర్ జగదీష్ బాబు రంగిశెట్టి, గౌరవ అతిథులుగా హెదరాబాద్లోని బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో–ఫౌండర్ డాక్టర్ మానిక్ రెడ్డి పుల్లగుర్ల, హైదరాబాద్లోని జెనరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో డాక్టర్ శ్రీనివాస్ ఆరుట్ల హాజరవుతారని వెల్లడించారు. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్, ఫార్మాకో జీనోమిక్స్ అండ్ ప్రెసిషన్ థెరపాటిక్స్, నానోటెక్నాలజీ అండ్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, కంప్యుటేషనల్ టూల్స్ అండ్ ఏఐ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిజైన్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్లినికల్ ట్రయల్ డిజైన్స్ ఫర్ ప్రెసిషన్ థెరపాటిక్స్, రోల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ టార్గెటెడ్ థెరపీ అనే అంశాలపై కూలంకషంగా చర్చిస్తారని పేర్కొన్నారు. బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాస బాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, కన్వీనర్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.