Skip to main content

కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలు

కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలు
  - ఐఐటీ కాన్పూర్‌ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్‌ వీకే.సింగ్‌
 - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ సెమినార్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కొత్త విధానాలు, ప్రయోగాలు, కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలను సాధించవచ్చునని ఐఐటీ కాన్పూర్‌ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్‌ వీకే.సింగ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అపై్లడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఎఫ్‌సీపీఏఆర్‌ (ఇండో–ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ ద ప్రమోషన్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌), సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ (సెంటర్‌ ప్రాంకో–ఇండీన్‌ పౌర్‌ లా ప్రమోషన్‌ డీ లా రీసెర్చ్‌ అవంకీ)ల ఆర్థిక సౌజన్యంతో జాయింట్‌ ఇండో–ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ సెమినార్‌ ఆన్‌ ‘‘ ఎక్స్‌ప్లోరింగ్‌ కాంటెంపోరరి విస్తాస్‌ ఇన్‌ అపై్లయింగ్‌ (ఆర్గానో) కాటలిసిస్‌ ఫర్‌ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్‌ సస్టేయినింగ్‌ ఫ్యూచర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ సెమినార్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఇంటర్నేషనల్‌ సెమినార్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ కాన్పూర్‌ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్‌ వీకే.సింగ్‌ మాట్లాడుతూ క్రియేటివిటీ ద్వారా పర్యావరణ అనుకూల కాటలిస్ట్‌లను అభివృద్ధి చేయడం సులభమని, ఇది గ్రీన్‌ కెమిస్ట్రీ దిశగా ముందడుగు వేసినట్లవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన కాటలిటిక్‌ ప్రక్రియలను రూపొందించినటై్లతే పరిశ్రమలకు లాభదాయకమన్నారు. అదే విధంగా క్రియేటివిటీ సహాయంతో ప్రత్యేకమైన అసిమ్మెట్రిక్‌ సింథసిస్‌ మార్గాలు అభివృద్ధి చేసి, కొత్త ఔషధ సమ్మేళనాలను తయారు చేయవచ్చునని పేర్కొన్నారు. అసమాన కాటలిసిస్‌ ప్రక్రియలలో నాణ్యతను పెంచడం, సమర్థతను మెరుగుపరచడం కూడా సాధ్యమవుతుందన్నారు. నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన రసాయన పద్ధతులను కూడా సృష్టించవచ్చునని పేర్కొన్నారు. అసిమ్మెట్రిక్‌ ఆర్గానోకాటలిసిస్‌లో సృజనాత్మక ఆలోచనలు కొత్త టెక్నాలజీల అభివృద్ధికి దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అసిమ్మెట్రిక్‌ ఆర్గానోకాటలిసిస్‌ అనేది రసాయన శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన పరిశోధనలలో ఒకటని, దీని ద్వారా పరిశ్రమలకు, పరిశోధనలకు, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో క్రియేటివిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నితిన్‌ సేథ్‌ మాట్లాడుతూ సీఫిప్రా ద్వారా భారతదేశం మరియు ఫ్రాన్స్‌ దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక పద్ధతుల్లో మౌలిక సహకారం జరుగుతోందన్నారు. దీని ద్వారా తాజా ఆవిష్కరణలతో పాటు పరిశోధనలు సమర్థవంతంగా జరుగుతాయన్నారు. సీఫిప్రా సముచితమైన నిధులు, వనరులు అందించి, సైన్సు పరిశోధనల్లో నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు, పరిశోధనలు చేసేవారికి ఇది ఎంతో ఉపయుక్తమన్నారు. అంతేకాకుండా భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య, పరిశోధనలకు అవకాశం పొందుతారన్నారు. ఇది విద్యార్థుల్లో జ్ఞానం, అనుభవం, సామర్థ్యాలను పెంపొందిస్తుందన్నారు. సీఫిప్రా ప్రాజెక్టులు భారతదేశం – ఫ్రాన్స్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా సహకారం అందిస్తాయన్నారు. పరిశోధన ద్వారా కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి వల్ల పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, సర్వీసులు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ డి బి రామాచారి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పి వెంకటేశు, ఐఐటి ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ మధుసూదన్, వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...