Skip to main content

భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కణ

భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారతీయ జర్నలిజంలో ధృవతారగా వెలిగిన మానికొండ చలపతిరావు భావితరాలకు మార్గదర్శి అని మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొట్టు శేఖర్ కొనియాడారు. అత్యున్నత వృత్తి ప్రమాణాలకు, నైతిక విలువలకు ఆయన పెట్టింది పేరని కీర్తించారు. అటువంటి మహనీయునిపై తెలుగులో వచ్చిన ఏకైక సంకలం బహుశా ఇదేనని అన్నారు. భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పేరిట సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ యూసూఫ్ గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సభకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షత వహించారు. 
ఈ సందర్భంగా పలువురు వక్తలు మానికొండ చలపతిరావు జర్నలిజం వృత్తి ప్రమాణాలతో పాటు జర్నలిస్టుల జీవన స్థితిగతుల మెరుగుదలకు చేసిన అపార కృషిని వివరించారు. జర్నలిస్టులకు ఇవాళ అంతో ఇంతో వృత్తిపరమైన భద్రత, వేజ్ బోర్డు, ప్రెస్ కౌన్సిల్ వచ్చిందంటే అది మానికొండ చలపతిరావు ఆనాడు చేసిన పోరాట ఫలితమేనని చెప్పారు. భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో మానికొండ చలపతిరావు ఎలియాస్ ఎంసీకి 33 ఏళ్ల పరిచయం ఉందని, నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు 3 దశాబ్దాలకు పైగా సంపాదకత్వం వహించినా ఏనాడూ ఎడిటోరియల్ వ్యవహారాలలో యాజమాన్యాన్ని తలదూర్చనివ్వని ధీరుడు మానికొండ చలపతి రావు, పద్మభూషణ్ లాంటి అవార్డును సైతం ఆయన తిరస్కరించారని వక్తలు కొనియాడారు. ఈ పుస్తకంలోని 30 వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యమని కొట్టు శేఖర్ అన్నారు.
నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కేవీ రఘునాధరెడ్డి చెప్పినట్టు మానికొండను తూచడానికి ఎవరి వద్దా తూనికరాళ్లు లేవని పుస్తక రచయిత అమరయ్య అన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం పుస్తక రచయితను మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీలు కఠారి అప్పారావు, అరవా రామకృష్ణ, చందు జనార్దన్, పి.రామమోహన్ నాయుడు తదితరులు సన్మానించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...