Skip to main content

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో "ఆరుద్ర సభా వేదికపై మెరిసిన ఆదిత్య రమ

- విజయవాడ లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో  "ఆరుద్ర సభా  వేదిక" పై  మెరిసిన
ఆదిత్య రమ
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్,రాజమండ్రి మొల్ల  డా.బి హెచ్.వి.రమాదేవి విజయవాడ  వన్ టౌన్ కె .బి.ఎన్.కాలేజి లో జరిగిన 6వ ప్రపంచ రచయితల మహాసభ లో *ఆరుద్ర సభావేదిక* పై  *యువత  కొరకు  అనేక ప్రక్రియలపై   ఎలాంటి మార్పు రావాలి!?* అనే అంశంపై ఆమె ప్రసంగించారు.చక్కని ప్రసంగం చేసి ,సీసపద్యం అశువుగా చెప్పినందుకు  పలువురు అభినందించారు. డి.ఎన్.ఏ ఛానల్ వారు వాయిస్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం గా ఆదిత్య అధినేత  ఛైర్మన్ డా.నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య  విద్యా సంస్థల  డైరెక్టర్ డా.ఎన్. సుగుణా రెడ్డి, రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్  ఎస్.పి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్  సి హెచ్. ఫణి కుమార్, ఎస్. కె.ఎన్.రెహ్మాన్,   చంద్రశేఖర్, రామకృష్ణ లు,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.ఆదిత్య ఎన్.. ఎస్ . ఎస్. డీన్  డా.జి.వి. ఎస్.నాగేశ్వర రావు  మాట్లాడుతూ ,డా.రమాదేవి  అదిత్యలో సాహిత్య , సేవారంగాలలో కూడా అతి చురుకుగా వ్యవహరిస్తారని , తనకు ఎన్. ఎస్.లో కూడా అత్యంత సహకారంగా  వుంటారనీ ఆయన అభినందించారు.డైరెక్టర్  గంగిరెడ్డి మాట్లాడుతూ  రమాదేవి అదిత్యకు ఒక తలమానికం అనీ, సేవా,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఆమె సేవలు గణనీయం అని చెప్పారు.ఆదిత్య కు ఎక్కువ బహుమతులు రావడానికి, ఆమె  ఇచ్చే శిక్షణ ప్రధాన కారణం ఆమెఅణువణువు నా ,అడుగడుగునా ,విద్యార్థుల లో సృజనను ప్రోత్సహించడానికి ఆమె తీసుకునే శ్రద్ధ ,శిక్షణ  మాత్రమే కారణం అని ఈ సందర్భంగా తెలియ జేశారు. ఆమెకు  కళా గౌతమి, అ.ర.సం,తెలుగు వెలుగు సాహితీ వేదిక,సాహితీ రస స్రవంతి,మొదలైన సాహితీ సంస్థలు  తమ శుభాకాంక్షలు   తెలియజేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...