Skip to main content

Posts

Showing posts from January, 2025

ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్‌ చేయబోతున్నాం

ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్‌ చేయబోతున్నాం - ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంటుకుమార్‌ ఎం.పటేల్‌ -  విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఇండస్ట్రీ అవసరాలు, టెక్నాలజీలకు అనుగుణంగా ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్‌ చేయబోతున్నామని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంటుకుమార్‌ ఎం.పటేల్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ‘‘ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పర్సనలైజ్డ్‌ డ్రగ్‌ డిస్కవరీస్‌– ఏ ఫ్యూచరిస్టిక్‌ అప్రోచ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ‘‘ నెక్ట్స్‌జెన్‌ ఫార్మా కనెక్ట్‌–2025’’ అనే ఇతివృత్తంతో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించిన తర్వాత ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంటుకుమార్‌ ఎం.పటేల్‌ మాట్లాడుతూ పీసీఐ ద్వారా విద్యార్థులకు, అధ్య...

ఇంకా "గగన"విహారం**చేస్తున్నట్లుగానే ఉంది

* ఇంకా "గగన"విహారం* *చేస్తున్నట్లుగానే ఉంది !!* "డాకు మహారాజ్"లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు - అందుకుంటున్న  *చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: "డాకు మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే... ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని" అంటోంది బాలనటి గగన గీతిక. "పిట్ట కొంచెం... కూత ఘనం" ఆనే సామెతను గుర్తు చేస్తూ... నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి... "లాయర్ విశ్వనాధ్" చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు..రెండవ మూవీ . "ఆర్.ఆర్.ఆర్, నారప్ప,18 పేజీస్, తెల్లవారితే గురువారం" తదితర చిత్రాలలో  హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది!! "90's మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం" చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన.. ప్రస్తుతం "ఓదెల రైల్వే స్టేషన్-2" చిత్రంలో తమన్న చిన్నప్పట...

28న బి.ఎల్. నారాయణకు తుమ్మల స్మారక సాహితీ పురస్కారం

28న బి.ఎల్. నారాయణకు తుమ్మల స్మారక సాహితీ పురస్కారం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బి.ఎల్. నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం గుంటురు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హెర్బాబు ప్రకటించారు. స్థానిక గాంధీనగర్లోని సిపీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో బెన్హర్ మాట్లాడుతూ ఈ నెల 28 మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు గాంధీనగర్ లోని కవిరాజు పార్కులోని శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్ భవనంలో జరిగే కార్యక్రమంలో అఖిల భారత అరసం అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రవాసభారతీయుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని బి. ఎల్. నారాయణకు అందిస్తున్నట్లు బెన్హర్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జ...

నెహ్రూనికేతన్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

నెహ్రూనికేతన్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 24-01-2025: నూతన విద్యావిధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్థానిక చెంచుపేటలో ఈ విద్యాసంవత్సరం నూతనంగా ప్రారంభించిన నెహ్రూనికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో 'స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్' పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘికశాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారుచేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా అకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ, జల చరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దుముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ, వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ...

డ్రైవర్ల అప్రమత్తతోనే సుఖ ప్రయాణం

డ్రైవర్ల అప్రమత్తతోనే సుఖ ప్రయాణం  - గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్‌ కే. సీతారామిరెడ్డి  - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రయాణీకులను సుఖంగా, భద్రంగా గమ్యం చేర్చాలన్నా, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నా డ్రైవర్ల అప్రమత్తతోనే సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్‌ కే. సీతారామిరెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం విజ్ఞాన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా ఉపరవాణా కమీషనర్‌ కే. సీతారామిరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, రాష్‌ డ్రైవింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి నేరాలను చేయకూడదన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో పనిచేసే డ్రైవర్లు మరింత అప్రమత్తతో పాటు పరిమితికి మించి విద్యార్థులను బస్సు లోపలికి అనుమతించ రాదన్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూగానీ, అధిక వేగంతో బస్సులను నడుపరాదని డ్రైవర్లను హెచ్చరించారు. ప్రతి...

తెలుగుతనం ఉట్టిపడేలా యాంకర్ రజని వ్యాఖ్యానం

తెలుగుతనం ఉట్టిపడేలా యాంకర్ రజని వ్యాఖ్యానం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జనవరి 20వ తేదీన స్వర్గీయ కృష్ణంరాజు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు వివిధ రంగాల వారికి కృష్ణంరాజు ప్రతిభా పురస్కారాలని  హైదరాబాద్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో అందజేశాయి. సినీ రాజకీయ సామాజిక సేవా రంగాల వారు విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఏంకర్ గా వ్యవహరించిన రజని లిజు తన వ్యాఖ్యాన చాతుర్యంతో విచ్చేసిన అతిధులు, అవార్డు గ్రహీతలు మరియు వీక్షకులను తన వ్యాఖ్యాణ చాతుర్యంతో మంత్ర ముగ్దులను చేశారు.ఓ రకంగా చెప్పాలంటే తెలుగు వారికి లభించిన మరో వ్యాఖ్యాణ ఆణిముత్యం రజని  లిజు అన్నది నా అభిప్రాయం మాత్రమే కాదు , నిన్నటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు ఎమ్ ఎల్ ఏ ,  ప్రభుత్వ విప్ రామమచంద్ర నాయక్ , ఘజల్ శ్రీనివాస్ , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , కార్యక్రమ నిర్వాహకులు ఎఫ్ టీ పీ సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా ,  నటులు అశోక్ కుమార్ , కృష్ణుడు ఇంకా విచ్చేసిన అనేకుల మాట. రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ యాంకర్ రజనీ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బీపీఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బీపీఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బెంగళూరులోని బీపీఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని మంగళవారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెంగళూరులోని బీపీఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్‌ అండ్‌ డీ వైస్‌ ప్రెసిడెంట్‌ మురళీక్రిష్ణ మీనన్, బిజినెస్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్ట్రాటజిక్‌ సర్వీసెస్‌ హెడ్‌ మనోగరన్‌లతో   వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఫ్యాకల్టీ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్, అకడమిక్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్, హ్యాండ్స్‌ ఆన్‌ ఎక్స్‌పీరియన్స్, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. విద్యార్థులు, అధ...

అంగరంగ వైభవంగా కృష్ణం రాజు ప్రతిభా పురస్కారాలు

అంగరంగ వైభవంగా కృష్ణం రాజు ప్రతిభా పురస్కారాలు   _ ఎఫ్ టీ పీ సి ఇండియా  - తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య వైద్య  సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రతిభాపురస్కారం తో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా ,  విజయ్ వర్మ పాకలపాటి లు మాట్లాడుతూ విద్య వైద్య సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణం రాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తించుకొనేలా ఈ అవార్డు ల కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమం లో దుబాయ్ కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథలానే ని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్ , మాజీ ఎం ఎల్ సి ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ ఆర్ ఓ వరల్డ్ చైర్మన్ నేమ్సింగ్  ప్రేమి ,...

సంక్రాంతి అంటే సంతోషాలు

సంక్రాంతి అంటే సంతోషాలు ., టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సంక్రాంతి అంటే సంబరాలు ., సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు.,  సంక్రాంతి అంటే కొత్త ధాన్యపు రాసుల., సంక్రాంతి అంటే రంగవల్లులు.,  సంక్రాంతి అంటే కేరింతలు.,  సంక్రాంతి అంటే గాలిపాతాకులు.,  సంక్రాంతి అంటే పిండివంటలు.,  సంక్రాంతి అంటే కొత్తబట్టలు.,  సంక్రాంతి అంటే కోడిపందాలు.,  సంక్రాంతి అంటే కొత్తఅల్లుళ్లు.,  సంక్రాంతి అంటే సినిమాలు.,  సంక్రాంతి అంటే పిల్లల కేరింతలు., సంక్రాంతి అంటే ఆటలు, పాటలు., సంక్రాంతి అంటే జ్ఞాపకాలు., సంక్రాంతి అంటే ఆనందాలు ... సంక్రాంతి అంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి, సంవత్సరంలో వచ్చే ఈ పండుగని మిస్ అయితే వీటన్నింటినీ మిస్ అవుతారు. అందుకే సంక్రాంతి కి పల్లె రమ్మని పిలుస్తుంది.  ఎప్పుడూ ఉండే పండగే కదా అనుకోకండి ... గడిచిన కాలం ఎప్పుడు తిరిగిరాదు అందులోనూ మన వాళ్ళతో గడిపే క్షణాలు ఎప్పుడు మధురమే అలాంటి మధురమైన జ్ఞాపకాలను ఇచ్చే పండగను అసలు మిస్ అవ్వకండి. #సేకరణ #చిత్రం : కోట ప్రసన్న జ్యోతి 

నూతనం గా పిల్లల ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం

నూతనం గా పిల్లల ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో  తెనాలి ఐ సి డి ఎస్  ప్రాజెక్ట్ సి డి పి ఓ ఆదేశాల మేరకు సున్న వయస్సు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల కోసం ఆధార్ నమోదు కేంద్రాలను తెనాలి 13 వార్డు లోని అంగన్వాడీ సెంటర్ నందురెండు ఆధార్ నమోదు కేంద్రాలను, మఠం బజార్, రజక పేట లోని అంగన్వాడీ సెంటర్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాల్లో పిల్లల ఆధార్ నమోదు తో పాటు తల్లిదండ్రుల  వివరాలు చేర్పులు, మార్పులు కూడా చేయబడుతుంది, ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఐ సి డి ఎస్ పి ఓ యం  సునీత తెలిపారు. మంగళవారం ఆమె ఆధార్ కేంద్రాలను పర్యవేక్షించారు. వివరాలను వివరాలను వెల్లడించారు. బ్లూ 3 ఐ టి సంస్థ రాష్ట్రం లోని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని పార్వతీపురం,  మన్యం , ఏలూరు జిల్లాలలో  గిరిజన ప్రాంతంలో  గిరిజన ప్రజలకు సుమారు  3 లక్షల మందికి  ఆధార్ కార్డ్లు  నమోదు చేయడం  జరిగిందని బ్లూ 3 ఐ టి మేనేజింగ్ డైరెక్టర్ తమనం రాకేష్ తెలిపారు. తన స్వగ్రామం తెనాలిలో అదార్ కేంద్రం ఏర్...

లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కే వేరు

లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కే వేరు _ గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌ _ మన ప్రవర్తనే మనల్ని నిర్ణయిస్తుంది : ఇండియన్‌ యాక్టర్‌ సంపూర్ణేష్‌ బాబు _ ఘనంగా ముగిసిన విజ్ఞాన్‌ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కు, అనుభూతిని మాటల్లో వర్ణించలేమని గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌ అన్నారు. స్థానిక గుంటూరు నగరం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘విజ్ఞాన్‌ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు–2025‘ ఘనంగా ముగించారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌ మాట్లాడుతూ కళాశాలలో ఉన్నప్పుడే భవిష్యత్‌ గురించి ప్లాన్‌ చేసుకోవాలన్నారు. జీవితంలో మీకు నచ్చిన రంగాన్నే ఎంచుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ డ్రగ్స్‌కు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని కోరారు. అదే విధంగా బైక్‌లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయకూడదని, ప్రతి ఒక్కరూ హె...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్స్‌ లారా, విజ్ఞాన్స్‌ ఫార్మసీ, విజ్ఞాన్స్‌ జూనియర్‌ కాలేజీలలోని విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. 2025 సంవత్సరంలో విద్యార్థులు కష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని... వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో 2025వ సంవత్సరానికి గాను తీర్మానించిన ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీæవైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో ...