Skip to main content

28న బి.ఎల్. నారాయణకు తుమ్మల స్మారక సాహితీ పురస్కారం

28న బి.ఎల్. నారాయణకు తుమ్మల స్మారక సాహితీ పురస్కారం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బి.ఎల్. నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం గుంటురు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హెర్బాబు ప్రకటించారు. స్థానిక గాంధీనగర్లోని సిపీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో బెన్హర్ మాట్లాడుతూ ఈ నెల 28 మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు గాంధీనగర్ లోని కవిరాజు పార్కులోని శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్ భవనంలో జరిగే కార్యక్రమంలో అఖిల భారత అరసం అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రవాసభారతీయుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని బి. ఎల్. నారాయణకు అందిస్తున్నట్లు బెన్హర్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగానికి ఎనలేని సేవలు అందించిన బి.ఎస్. నారాయణకు కామ్రేడ్ తుమ్మల సాహితీ పురస్కారాని ప్రకటించడం హర్షనీయమన్నారు. పాత్రికేయునిగానే కాక రచయితగా దివంగత ప్రముఖులపై 'జయహో మన తెనాలి', 'చరితార్థులు'తోపాటు అనేక పుస్తకాలను బి.ఎల్. రచించారు. గతంలో బి.ఎల్. నారాయణ కాళోజీ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహోన్నతులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు పురస్కారాన్ని, పిల్లలమర్రి రాధాదేవి స్మారక రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేకరి పురస్కారం, నార్ల వెంకటేశ్వరరావు-దేవినేని పురస్కారం, ప్రముఖ పాత్రికేయుడు జీఎల్ఎస్ గాంధీ స్మారక అవార్డులు అందుకున్నారని హకీం జాని తెలిపారు. నేపథ్యంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ, బుర్రా నరసింహ, ఆకుల శ్రీనివాసరావు, వి. వెంకటేశ్వరరావు, కె. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...