Skip to main content

అంగరంగ వైభవంగా కృష్ణం రాజు ప్రతిభా పురస్కారాలు

అంగరంగ వైభవంగా కృష్ణం రాజు ప్రతిభా పురస్కారాలు 
_ ఎఫ్ టీ పీ సి ఇండియా 
- తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య వైద్య  సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రతిభాపురస్కారం తో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా ,  విజయ్ వర్మ పాకలపాటి లు మాట్లాడుతూ విద్య వైద్య సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణం రాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తించుకొనేలా ఈ అవార్డు ల కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమం లో దుబాయ్ కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథలానే ని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్ , మాజీ ఎం ఎల్ సి ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ ఆర్ ఓ వరల్డ్ చైర్మన్ నేమ్సింగ్  ప్రేమి , తదితరులు విచ్చేసి పలురంగాల వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.బాలీవుడ్ నటీమణులు ధని బోస్,మోక్ష , అనీషా ముఖర్జీ , నేహా షా లకు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.
భీమవరం లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న కారణంగా హైదరాబాద్ లో జరిగే ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విజయ్ వర్మ , చైతన్యలకు తమ కుటుంభం తరుపున అభినందనలు తెలుపుతున్నట్లు స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వీడియో విడుదల చేయడమే కాక కార్యక్రమం జరిగే సమయంలో ఫోన్ చేసి నిర్వాహకులను , అతిధులను , అవార్డు గ్రహీతలను అభినందించారు.
 ఎఫ్ టీ పీ సి ఇండియా కు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడంపట్ల సంస్థ అధ్యక్ష కార్యదర్సులు హర్షం వ్యక్తం చేశారు.ఇండియా లోనే ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక సంస్థ ఎఫ్ టీ పీ సి ఇండియా కావడం విశేషం . 
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి హాల్ లో ఈకార్యక్రమం జరిగింది .

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...