Skip to main content

నెహ్రూనికేతన్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్


నెహ్రూనికేతన్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 24-01-2025: నూతన విద్యావిధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్థానిక చెంచుపేటలో ఈ విద్యాసంవత్సరం నూతనంగా ప్రారంభించిన నెహ్రూనికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో 'స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్' పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో
చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘికశాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారుచేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా అకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ, జల చరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దుముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ, వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూనికేతన్ ముందువరుసలో ఉంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాము. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టీ విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తిస్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు, మా ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూనికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బుర పరచారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...