Skip to main content

లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కే వేరు

లక్ష్యాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కే వేరు
_ గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌
_ మన ప్రవర్తనే మనల్ని నిర్ణయిస్తుంది : ఇండియన్‌ యాక్టర్‌ సంపూర్ణేష్‌ బాబు
_ ఘనంగా ముగిసిన విజ్ఞాన్‌ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించిన తర్వాత వచ్చే కిక్కు, అనుభూతిని మాటల్లో వర్ణించలేమని గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌ అన్నారు. స్థానిక గుంటూరు నగరం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘విజ్ఞాన్‌ స్రవంతి క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు–2025‘ ఘనంగా ముగించారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్, ఐపీఎస్‌ మాట్లాడుతూ కళాశాలలో ఉన్నప్పుడే భవిష్యత్‌ గురించి ప్లాన్‌ చేసుకోవాలన్నారు. జీవితంలో మీకు నచ్చిన రంగాన్నే ఎంచుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ డ్రగ్స్‌కు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని కోరారు. అదే విధంగా బైక్‌లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని హితవు పలికారు. 

మన ప్రవర్తనే మనల్ని నిర్ణయిస్తుంది : ఇండియన్‌ యాక్టర్‌ సంపూర్ణేష్‌ బాబు
జీవితంలో మనం ఎదుటివారితో మాట్లాడే మాటతీరు,∙ప్రవర్తనే మన స్థాయిని నిర్ణయిస్తుందని ఇండియన్‌ యాక్టర్‌ సంపూర్ణేష్‌ బాబు అన్నారు. మనం ఇతరులకు ఇచ్చే సంస్కారమే మనల్ని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. విద్యార్థులందరూ కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. జీవితంలో దేవుడు మనకు కష్ట సుఖాలతో పాటు అవకాశాలను కూడా ఇస్తారన్నారు. ఆ అవకాశాలను వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. జీవితంలో మనం ఎదగడానికి ఎవరి సపోర్ట్‌ అవసరం లేదని, మన మీద మనకు నమ్మకం ఉంటే అదే విజయానికి దరిచేరుస్తుందన్నారు. మన ఆలోచనలు ఎల్లప్పుడూ గొప్పగా ఉంటేనే మనం కూడా గొప్ప స్థాయికి ఎదగగలమని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గుడివాడ జూనియర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వీ.మణి చైతన్య మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని అధిగమించాలన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడు నిజాయితీ, నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ధితో ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాప్రతాలు, మెమొంటోలు అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వీ.అనురాధ, నిరుల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...