Skip to main content

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల( బీజీఎస్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ ఇంటిరిమ్‌ వైస్‌ ప్రోవోస్ట్‌ ప్రొఫెసర్‌ రామ్‌ వీరపనేని, ఆర్కిటెక్చర్‌ అండ్‌ అప్లైడ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ వేల్‌ మోక్తర్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బీజీఎస్‌యూతో కలిపి జాయింట్‌ డిగ్రీలను అందజేయవచ్చునన్నారు. ఉదాహరణకు తమ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థి 3 సంవత్సరాలు పాటు ఇక్కడ చదివి, 4వ సంవత్సరం కోర్సును బీజీఎస్‌యూలో చదవచ్చునన్నారు. బీజీఎస్‌యూలో వచ్చే క్రెడిట్స్‌ను ఆధారంగా చేసుకుని తమ యూనివర్సిటీ విద్యార్థికి యూజీ డిగ్రీను అందజేస్తామన్నారు. ఒకవేళ అదే విద్యార్థి 5వ సంవత్సరం కూడా బీజీఎస్‌యూలో ఉంటే వారికి బీజీఎస్‌యూ మాస్టర్స్‌ డిగ్రీను అందజేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా యూఎస్‌ఏలో అక్కడే మరో మూడు సంవత్సరాలు పాటు ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకలు, బీజీఎస్‌యూ అధ్యాపకులు కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు, ల్యాబ్‌లను కలిసి నిర్వహించుకుని సౌలభ్యం లభిస్తుందన్నారు. విద్యార్థులకు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు లభించే అవకాశం ఉందన్నారు. ప్రాక్టికల్‌ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు వచ్చే స్టార్టప్‌ ఐడియాలను టెస్ట్‌ చేసుకోవచ్చనని తెలియజేసారు. ఈ సందర్భంగా యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ ఇంటిరిమ్‌ వైస్‌ ప్రోవోస్ట్‌ ప్రొఫెసర్‌ రామ్‌ వీరపనేని మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్‌ అండ్‌ అప్లైడ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ వేల్‌ మోక్తర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ శ్రీ కొల్ల, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ కెన్‌ (జాన్‌), విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...