సంకల్ప బలంతో పాటు నిజాయితీ ఉండాలి
- సినిమా డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ)
- మిమ్మల్ని మీరు నిరూపించుకోండి : పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్
- మహోత్సవ్తో విద్యార్థులకు నూతన అనుభవం : వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్)
- విజ్ఞాన్లో వైభవంగా ముగిసిన మహోత్సవ్–2కే25
- ఘనంగా ‘‘వాయిస్ ఆఫ్ విజ్ఞాన్’’ మ్యాగజైన్ ఆవిష్కరణ
- క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థి లోకం
,- విజేతలకు ట్రోఫీలు, రూ.15 లక్షల నగదు బహుమతులు అందజేత
ఉత్సాహం ఉరిమింది. క్రీడా సంద్రంలో యువత తడిసి ముద్దయింది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అదరహో అనిపించారు. కళాకారుల సందడి, క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ మరోసారి ఆటల మైదానంలో తనదైన ముద్రను చాటుకుంది. యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహోత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ట్రోఫీలను, రూ.15 లక్షల నగదు బహుమతులను అందజేశారు.
మన కలలను సాకారం చేసుకోవడానికి సంకల్ప బలంతో పాటు నిజాయితీ కూడా ఉండాలని సినిమా డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం అంగరంగ వైభవంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) మాట్లాడుతూ మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే అల్లరితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలన్నారు. మీకు ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలోకి వెళ్లిపోండని విద్యార్థులకు సూచించారు. మీ సంకల్పంలో నిజాయితీ ఉంటే అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుందన్నారు.
మిమ్మల్ని మీరు నిరూపించుకోండి :
2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్
జీవితంలో మొదటగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని 2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్ అన్నారు. తాను పారాలింపిక్స్లో పతకం సాధించడానికి తల్లిదండ్రులు, కోచ్లు ఎంతగానో ప్రోత్సాహం అందిచారని తెలియజేసారు. జీవితంలో ఎప్పుడు కూడా మీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తాను 10వ తరగతి నుంచి స్పోర్ట్స్ జర్నీను ప్రారంభించానని వెల్లడించారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో 7వ స్థానంలో నిలిచినప్పుడు 6 నెలల పాటు కుంగుబాటుకు గురయ్యానని పేర్కొన్నారు. దానిని నుంచి త్వరగా కోలుకుని 2024 పారిస్లో జరిగిన పారాలింపిక్స్లో దేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకురాగలిగానన్నారు.
మహోత్సవ్తో విద్యార్థులకు నూతన అనుభవం : వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్)
విజ్ఞాన్స్ మహోత్సవ్ ద్వారా విద్యార్థులకు నూతన అనుభవం పొందే అవకాశం లభించిందని వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్) అన్నారు. అంతేకాకుండా లీడర్షిప్ మరియు టీమ్ వర్క్ నేర్చుకోవడం, వివిధ కళా మరియు సాంకేతిక రంగాలలో మెరుగుదల, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాల విద్యార్థులతో ఇంటరాక్షన్ పెరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నృత్యం, పాటలు, డ్రామా, ఫ్యాషన్ షో లాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలుగులోకి వస్తాయన్నారు. క్రీడలు – క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, మరియు ఇతర క్రీడలు విద్యార్థులలో స్పోర్ట్స్మాన్షిప్ను పెంపొందిస్తాయన్నారు.
ఘనంగా ‘‘వాయిస్ ఆఫ్ విజ్ఞాన్’’ మ్యాగజైన్ ఆవిష్కరణ
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు, వర్క్షాప్లు, అవగాహన ఒప్పందాలు, సెలబ్రటీ ఇంటర్వ్యూలు, అతిథి ఉపన్యాసాలు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ప్రముఖుల ఉపన్యాసాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, స్నాతకోత్సవాలు, ఫెస్ట్లు, స్పోర్ట్స్, స్టూడెంట్స్ యాక్టివిటీ క్లబ్స్, ఇతర సామాజిక కార్యక్రమలు వంటి వాటిని సమూహారంగా ఒకచోటికి చేర్చి విద్యార్థులకు అందజేయడమే లక్ష్యంగా రూపొందించిన ‘‘ వాయిస్ ఆఫ్ విజ్ఞాన్ ’’ మ్యాగజైన్ను అతిథులు ఆవిష్కరించారు.
విజ్ఞాన్ మహోత్సవ్ 2కే25 విజేతలు
జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్లో భాగంగా మొత్తం 80 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. మహోత్సవ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ చాంపియన్షిప్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ జట్టు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతి సాధించింది. రన్నరప్గా నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్ జట్లు నిలిచాయి. మహిళల వాలీబాల్లో జీఈసీ కాలేజ్ ( మొదటి స్థానం ), ఎస్వీసీఈ ( రెండోస్థానం ) సాధించాయి. బాస్కెట్బాల్లో కేఎల్యూ (మొదటి స్థానం ), మోహన్బాబు యూనివర్సిటీ (రెండోస్థానం ) సాధించాయి. కబడ్డీలో వీఎన్ఆర్ వీజేఐటీ ( మొదటి స్థానం ), ఎస్వీసీ ( రెండోస్థానం )లో నిలిచాయి. ఖోఖోలో అనురాగ్ యూనివర్సిటీ ( మొదటి స్థానం ), జీ.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ ( రెండోస్థానం ) నిలిచాయి.
వందకుపైగా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు
మహోత్సవ్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాలకు చెందిన వందకుపైగా యూనివర్సిటీలు, కళాశాలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. 50వేల మందికి పైగా విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో పాల్గొన్నారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్), వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.