Skip to main content

ఉమెన్స్ డే ప్రత్యేక కధనం

*ఉమెన్స్ డే ప్రత్యేక కధనం*

HAPPY WOMENS DAY - 2025
*ఇంటి భోజనాన్ని తయారు చేసి ఆన్ లైన్ అమ్మకాల ద్వారా లక్ష రూపాయలు పైబడి సంపాదిస్తున్న మహిళలు*
*మహిళలకు షీరో హోమ్ ఫుడ్ అందిస్తున్న గొప్ప స్వయం ఉపాధి* 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మహిళలు నేడు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. వ్యాపార ఉద్యోగ రంగాలలో నేడు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు మహిళలు వివిధ కారణాల రీత్యా ఇంటిగడప దాటలేని పరిస్థితి, కానీ ఏదో ఒక్కటి చేసి తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా వుండాలని పరితపిస్తూ వుంటారు. ముఖ్యంగా తమకు తెలిసిన వంటలతో ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలని ఎందరో ఆలోచిస్తుంటారు. కానీ వాటిని ఎక్కడ ఎలా అమ్మాలో తెలియక సతమతమవుతూ వుంటారు. అటువంటి మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తాం అంటూ 4 సంవత్సరాల కింద ముందుకొచ్చిన సంస్థే షీరో హోమ్ ఫుడ్. మహిళలు తమకు తెలిసిన వంట నైపుణ్యానికి షీరో సంస్థ అందించే మెళకువలను జోడించి దక్షిణ ఉత్తరాది వంటకాలను రుచికరంగా శుచికరంగా తయారు చేసి ప్రతినెలా ఆయా ప్రాంతాన్ని భట్టి పది వేల నుండి లక్ష రూపాయల పైబడి సంపాదించి తమ వంట గదినుండే మహిళలు వ్యాపారవేత్తగా రాణించేలా ప్రోత్సహిస్తోంది.ప్రతి మహిళ తాము చేసే వంట రుచికరంగా చేసేందుకే తపన పడతారు, అయితే వారు చేసే వంట అమీర్ పేట లో చేసిన , అనకాపల్లి లో చేసినా ,అమెరికా లో చేసినా ఒకే రంగు ఒకే రుచి తో పాటు ఒకేలా కనబడేలా వుండేందుకై అన్ని రకాల వంటకాలకు షీరో హోమ్ ఫుడ్ ఉచిత శిక్షణను అందిస్తోంది. తెలుగు వంటకాలే కాకుండా తమిళనాడు , కేరళ మరియు ఉత్తరాది రుచులు సైతం అవలీలగా నిర్ణీత సమయంలో చేసేలా తర్ఫీదుని ఇస్తోంది.అంతేకాకుండా వారు చేసిన వంటకాలని తమ వెబ్ సైట్, ఆప్ తో పాటు స్విగ్గీ , జొమాటో, వాయు , ఓ ఎన్ డి సీ వంటి అనేక ఫుడ్ డెలివరీ పార్టనర్స్ తో భాగస్వామ్యాన్ని కల్పించి చక్కని ఆదాయాన్ని పొందేలా షీరో హోమ్ ఫుడ్ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది.పప్పు పచ్చడి సాంబార్ వంటి ఇంటి భోజన వంటకాలనే కాకుండా వారు నిష్ణాతులుగా వున్న తినుబండారాలు మరియు ఇతర అనేక వంటకాలు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విక్రయించుకొని స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది.పెట్టుబడి లేకుండా ఇంట్లో వుండే స్టవ్ , గిన్నెలతో ప్రారంభించదగ్గ వ్యాపార మోడల్ తో పాటు కొద్దిపాటి పెట్టుబడితో నలుగురు లేదా అయిదుగురు మహిళలు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కమ్యూనిటీ కిచెన్ ని ప్రారంభించి సంపూర్ణ వ్యాపార మోడల్ లో మూడు లక్షల రెవిన్యూ పొందేలా మరో బిజినెస్ మోడల్ ని కూడా షీరో హోమ్ ఫుడ్ నిర్వహిస్తోంది. ఆశక్తి కలవారికి ముందుగా ఓ సెమినార్ ని నిర్వహించి వ్యాపార నమూనాను విశదీకరించి తాము చేయగలం అని ముందుకు వచ్చిన మహిళామణులకు షీరో కుటుంభంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. షీరో లో చేరి ఎందరో మహిళలు తమ స్వయం శక్తితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, పిల్లల ఫంక్షన్స్ గర్వంగా చేసుకోగలుగుతున్నారు..ఇలా భర్తలకు చేదోడుగా ఉండగలిగే స్థాయిలో ఉన్నందుకు గర్విస్తున్నారు. నేను మహిళా ఎంట్రప్రెన్యూర్ ని అని తలెత్తుకొని నలుగురితో  గర్వంగా చెప్పుకొంటున్నారు. మా ఇంట్లో మా నాన్న హీరో అయితే అమ్మ షీరో అని పిల్లలు గర్వంగా చెప్పుకొంటున్నారు. ఇప్పటికే 3 వేల మంది మహిళలకు చేయూతగా నిలిచిన షీరో హోమ్ ఫుడ్ సంస్థ కొద్ది సంవత్సరాలలోనే పది లక్షల మంది మహిళలకు చేయూతగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల లోని జిల్లా ప్రధాన నగరాల మొదలు హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఈ కిచెన్ ని ప్రారంభించి మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. ఆసక్తి కల మహిళలు ఉచిత సెమినార్ లో పాల్గొనేందుకై 6309527444 నెంబర్ కి తమ పేరు ఏరియా సిటీ ని వాట్సాప్ చేస్తే ఏ తేదీన సెమినార్ లో పాల్గొనాలో తెలియచేస్తామని సంస్థ కన్వీనర్ అంటున్నారు.
 *ఒక్క కిచెన్ తో ప్రారంభించి 3 వేల మంది మహిళలకు సాధికారికత కల్పించిన వ్యవస్థాపకులు*
ఒక్క కిచెన్ గా ప్రారంభం ఐన షీరో సంస్థని తెలుగు మూలాలు వున్న తిలక్ వెంకటస్వామి , జయశ్రీ తిలక్ లు నేడు దక్షిణాది 3 వేల పైబడి కిచెన్స్ గా తీర్చిదిద్ది ఆయా మహిళల ద్వారా 3 వేల కుటుంబాలు అభివృద్ధి బావుటా పట్టేలా షీరో హోమ్ ఫుడ్ ని తీర్చి దిద్దారు. తెలుగు రాష్ట్రాలలో 300 మంది ఈ షీరో హోమ్ ఫుడ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం , విజయవాడ , గుంటూరు , వరంగల్ , ఖమ్మం వంటి పట్టణాలలోనే కాకుండా జగిత్యాల , తాడేపల్లి గూడెం, తెనాలి ,శ్రీకాళహస్తి ,  మంగళగిరి వంటి తృతీయ పట్టణాలలో సైతం ఎందరో మహిళలు 
ఉపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సువర్ణా దేవి పాకలపాటి మాట్లాడుతూ :- మండల స్థాయినుండి రాష్ట్ర స్థాయివరకు డెలివరీ పార్టనర్స్ వున్న ప్రతి ప్రాంతంలో మహిళలకు శిక్షణ ఇచ్చి ఈ ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ వారు ప్రవేశించేలా కృషిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో సైతం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తెలుగు రాష్ట్రాలలోని ఒక లక్ష కుటుంబాలకు అండగా నిలవాలన్నదే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...