Skip to main content

మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు

మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు

 బెంగళూరులోని ఇస్రో హెచ్‌క్యూ డెప్యూటీ డైరెక్టర్‌ నిరుపమ తివారి
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవ వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని ఇస్రో హెచ్‌క్యూ డెప్యూటీ డైరెక్టర్‌ నిరుపమ తివారి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను ‘‘యాక్సలరేట్‌ యాక్షన్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని ఇస్రో హెచ్‌క్యూ డెప్యూటీ డైరెక్టర్‌ నిరుపమ తివారి మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు నడుపుతున్న విప్లవాత్మక మార్పులు మరియు వారి ప్రతిభను ప్రజలకు తెలియజేయడం ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమన్నారు. విద్య, ఆరోగ్యం, విజ్ఞానం, మరియు అన్ని రంగాల్లో మహిళలకు అవగాహన పెంచడానికి అంకితమైన ఈ కార్యక్రమాలు మహిళల ప్రతిభను ప్రపంచానికి అందించడం లక్ష్యంగా ఉంటాయన్నారు.
కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన రిపబ్లిక్‌ ఆఫ్‌ జింబాబ్వే ప్రెసిడెన్షియల్‌ అండ్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కేబినెట్‌ చీఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాడ్జనాని కచేరే మాట్లాడుతూ మహిళలు తమ గమ్యాలను చేరుకోవడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలలో మహిళలు ముందంజలో ఉన్నారని, అనేక విభాగాలలో మహిళలు, ఆంగ్ల విద్య, శాస్త్ర సాంకేతికత, ఆరోగ్యం, సామాజిక సేవ, కళలు మరియు ఇతర రంగాలలో తమ సత్తా చాటుతున్నారని వెల్లడించారు. 
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నవభారత్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ యార్లగడ్డ త్రిపురాంబ మాట్లాడుతూ మహిళలు అవకాశాల కోసం ఎవరి కోసమో ఎదురుచూడొద్దని, విజ్ఞానం, నైపుణ్యం పెంచుకుంటే స్త్రీలు ఏదైనా సాధించొచ్చని పేర్కొన్నారు. ఎందరో మహిళలు దేశ నాయకులుగా చరిత్ర సృష్టిస్తూ, జాతి దశను, దిశను మార్చేస్తున్నారని తెలిపారు. స్త్రీలు స్వతహాగా శక్తి స్వరూపులని తెలియజేసారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఎన్‌జీవో సోషల్‌ యాక్టివిస్ట్‌ రంగనాయకమ్మ మాట్లాడుతూ మహిళలు జీవితంలోను, సమాజంలోని సమస్యలపై గట్టిగా పోరాడాలని తెలిపారు. మహిళలు ఎప్పుడూ కూడా తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. తమ బలాలను పెంచుకుంటూ బలహీనతలను అధిగమించాలన్నారు. 
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, అధ్యాపకులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...